Samantha : గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత పేరు మార్మోగిపోతోంది. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గురించి వస్తున్న వార్తలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న భావాలను వీడియోల రూపంలో, కొటేషన్ల రూపంలో పోస్ట్ చేస్తూ సమాజాన్ని ప్రశ్నించడమే కాకుండా తన మనసులో ఉన్న బాధను కూడా బయట పెడుతోంది.
విడాకుల ప్రకటన తర్వాత ఎవరి దారి వారిదే అని చెప్పిన ఈ జంట ప్రస్తుతం వారి కెరీర్ విషయంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సమంత విడాకుల బాధ నుంచి బయట పడటం కోసం సినిమా అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన శరీరంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువగా జిమ్ లో గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా సమంత జిమ్ లో తన స్నేహితులతో కలిసి కుస్తీ పడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా.. ఫిట్ గా ఉన్న వారితో పోటీ వద్దు. అలాంటి వారితో పోటీ పడటం వల్ల ఎంతో బాధను భరించాల్సి వస్తుంది.. అంటూ క్యాప్షన్ జోడించింది. అయితే సమంత ఈ కొటేషన్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టింది ? ఎవరి గురించి ఇలా మాట్లాడింది ? ఈ మాటల వెనుక ఏదైనా అర్థం దాగి ఉందా ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మరి సమంత ఏముందో.. మనకు తెలియదు కదా. ఏది ఏమైనా.. ఆమె విడాకుల తరువాత తీవ్రంగా మనస్థాపం చెందినట్లు మాత్రం తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…