Samantha : కొంత కాలం క్రితం తెలుగు హీరోయిన్లలో సమంత టాప్ పొజిసన్ లో ఉండేది. కానీ నాగ చైతన్యతో వివాహం తరువాత తనకు నెమ్మదిగా సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయింది. పెళ్లి తరువాత ఈమె చాలా పెద్ద సినిమాలను చేజార్చుకుందని సమాచారం. కానీ తను విడాకులు తీసుకున్న దగ్గరి నుండి మళ్లీ మునుపటి లా సినిమాలు చేయడం మొదలు పెట్టింది. హాట్ ఫోటో షూట్ లతో వేగంగా సినిమాలు ఒప్పుకుంటూ దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. అంతే కాకుండా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈమెకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. దాంతో బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు రావడం మొదలైంది.
పుష్ప ఐటం సాంగ్ తో ఎక్స్ పోజింగ్ హద్దులు చెరిపేసిన సమంత కోసం తెలుగు నిర్మాతలు క్యూ కడతారని భావించినప్పటికీ అలా జరగడం లేదు. దానికి కారణం సమంత రెమ్యునరేషన్ భారీగా పెంచడమే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ద్వారా సమంతకి వచ్చిన క్రేజ్ చూసిన దర్శకుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో తాను తీయబోయే తదుపరి సినిమాలో చేయడానికి అడిగినట్లు సమాచారం. కానీ సమంత ఈ ఆఫర్ ను తిరస్కరించిందని తెలిసింది.
అయితే కొరటాల శివ తాను చేయబోయే జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సమంతకి రూ.2.50 కోట్ల పారితోషికం కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారట. కానీ సమంత రూ.4 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు. అంతకంటే తక్కువ అయితే చేసేది లేదని తేల్చి చెప్పిందట. కానీ నిర్మాతలు అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పకోకపోవడంతో సమంత ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం. దాంతో మంచి అవకాశాన్ని చేజార్చుకుందని సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…