Anasuya : ఆంటీ.. ఆంటీ.. ఆంటీ.. ట్విటర్లో ఎక్కడ చూసినా ఇదే పదం కనిపిస్తోంది. ఆంటీ అని పిలవడం ఏజ్ షేమింగ్ అని అనసూయ మండిపోతుంటే.. మేము మాత్రం ఆంటీ అని పిలవడం మానేదే లేదని మరింత రెచ్చిపోతున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్టార్ యాంకర్ అనసూయ అమ్మను అంటే ఆ ఉసురు ఊరికే పోదు అంటూ ఇన్డైరెక్ట్గా ట్వీట్ చేసింది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇంకొందరై బూతులు తిట్టారు. ఈ క్రమంలో కొందరు అనసూయను అంటీ అని సంబోధించారు. దీనిపై అనసూయ ఫైర్ అయ్యింది. తనను ఆంటీ అంటూ వయసు ఆధారంగా టార్గెట్ చేస్తున్నారని, అలా అన్న వారిపై కేసు పెడతానంటూ సీరియస్ అయ్యింది అనసూయ. దీంతో ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసి సదరు ఫ్యాన్స్ మరింతగా ట్రెండ్ చేయటం ప్రారంభించారు. మరోవైపు అనసూయ ఏమాత్రం తక్కువ తినలేదు. తనను ట్విట్టర్ వేదికగా విమర్శించిన వారికి అంతే గట్టిగా సమాధానం ఇస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంటీ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. కాగా.. ఈ వివాదంలోకి శ్రద్దా దాస్ ఎంటరవుతూ అనసూయకు సపోర్టిచ్చింది. నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా ఉంటావు. నీకంటే రెట్టింపు వయసున్న అంకుల్స్ కన్నా కూడా నువ్వే హాట్గా కనిపిస్తావు. ఎల్లప్పుడూ నీకు అభిమానినే అని రాసుకొచ్చింది.
అయితే తనపై అసభ్యకరమైన రీతిలో కామెంట్స్ చేస్తున్నవారిపై అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ అనసూయ కంప్లెయింట్ ఇచ్చిందనే అంటున్నారు. ఇక దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…