Charmy Kaur : ఈ ఆగస్టు 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లైగర్. హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించగా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మొదటి రోజునే రూ.200 కోట్లు వసూలు చేస్తుందని సినిమా యూనిట్ చేసిన ప్రచారం కేవలం కలగానే మిగిలిపోయింది. లైగర్ సినిమాకు వరల్డ్ వైడ్గా రూ.90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంత డిజాస్టర్ టాక్ తో దారుణమైన నెగెటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో పూరీని ఏకేస్తున్నారు. లైగర్ చిత్రం పరాజయంతో పూరీ జగన్నాథ్ పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా పూరీపై ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నందుకు ఛార్మి కూడా నిండా మునిగింది అనే వార్తలు తీవ్రంగా ప్రచారం అవుతున్నాయి.
లైగర్ చిత్రం విడుదలైన మొదటి షోకే ఫలితం తెలియడంతో ఛార్మి తన సన్నిహితుల దగ్గర చాలా ఎమోషనల్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 20 ఏళ్లు కష్టపడి కూడబెట్టుకున్న 200 కోట్ల రూపాయలు ఒక్కసారిగా లైగర్ చిత్రంతో నష్టపోయాను అని సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడటం జరిగిందట ఛార్మి. అంతే కాకుండా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్న జనగణమన చిత్రానికి కూడా ఛార్మి నిర్మాణ బాధ్యతలు వహిస్తోంది. లైగర్ చిత్రం డిజాస్టర్ తో ఈ ప్రభావం కాస్త జనగణమన చిత్రంపై పడే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనితో ఛార్మి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…