స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి పైగా సక్సెస్ రేట్ను సాధించడం సంతోషంగా ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28న ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జట్లన్నీ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఆరంభ మ్యాచ్ బెంగళూరులో జరగనుండగా అందులో ఆతిథ్య జట్టు హైదరాబాద్తో తలపడనుంది. ఇక ముంబై ఇండియన్స్ శిక్షణ శిబిరంలో ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తన భారత టీ20 జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదువుల్లో అనుకున్నంత రాణించకపోయినా, క్రికెట్లో సత్తా చాటుతున్నందుకు గర్వంగా ఉందన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత టీ20 క్రికెట్ జట్టు ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2026 ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. టోర్నమెంట్లో సూపర్ 8 దశలో ఒక్క సౌతాఫ్రికాతో తప్ప టీమిండియా ఏ జట్టుతోనూ ఓడలేదు. అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే అత్యంత విజయవంతమైన టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ గత కెప్టెన్ రోహిత్ శర్మను దాటేశాడు. అతని సక్సెస్ రేట్ ప్రస్తుతం 80కి పైగా ఉంది. ముంబైకి చెందిన సూర్య 2024లో భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్నాడు. గతంలో ముంబైకి రోహిత్ శర్మ నాయకత్వం వహించగా, ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్లలో కెప్టెన్గా 80 శాతానికి పైగా సక్సెస్ రేటుతో కొనసాగుతుండడంపై సూర్య స్పందిస్తూ తాను స్కూల్, కాలేజీ చదువుల్లో ఆ శాతం సాధించాలని అనుకున్నానని, కానీ ఇప్పుడు క్రికెట్లో ఆ శాతాన్ని సాధించానని తెలిపాడు. సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు 52 టీ20 మ్యాచ్లు ఆడగా 42 మ్యాచ్లలో విజయం సాధించింది. తాను స్కూల్లో ఎప్పుడూ 50 నుంచి 60 శాతం మార్కులనే సాధించేవాడినని, కానీ క్రికెట్లో 80 శాతానికి పైగా కెప్టెన్గా సక్సెస్ సాధిస్తున్నానని, ఇది తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని స్పష్టం చేశాడు. అయితే తాను గణాంకాలపై ఎక్కువగా దృష్టి పెట్టనని, ఏ ఆటలోనైనా ఎవరికీ ఓడిపోవడం ఇష్టం ఉండదని అన్నాడు. కానీ మ్యాచ్లను గెలిచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించాడు.
సూర్య కుమార్ యాదవ్ తండ్రి అశోక్ కుమార్ యాదవ్ బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పనిచేశారు. అయితే సూర్యకు చదువులపై పెద్దగా ఆసక్తి లేదని గమనించిన ఆయన అతని దృష్టిని క్రికెట్ వైపు మళ్లించారు. క్రికెట్ పై ఆసక్తి కలిగేలా చేయడంతోపాటు సూర్యకు ఎప్పటికప్పుడు సపోర్ఠ్గా నిలిచి ఇంతటి వాడిని చేశారు. ఈ సందర్భంగా సూర్య తన కుటుంబం గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు. తన కుటుంబం తనను ముందుగా బాగా చదివించాలని అనుకుందని, కానీ తనకు చదువులపై ఆసక్తి లేదని గమనించారని, తరువాతే తాను క్రికెట్లోకి వచ్చానని తెలిపాడు. ప్రస్తుతం తాను క్రికెట్ ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నానని, ఆడటాన్ని ఇష్టపడుతున్నానని అన్నాడు.
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…