టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు లభించింది. ఈ అవార్డును రామ్ చరణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె స్వీకరించారు. అవార్డు స్వీకరిస్తూ తన ప్రయాణాన్ని కొన్ని శక్తివంతమైన మాటల్లో వివరించిన రష్మిక.. మొదట తన నటనను ట్రోల్ చేశారని, ఇప్పుడు అదే రాష్ట్రం నాకు ఈ అవార్డు ఇచ్చిందని అన్నారు. తాను చాలా దూరం ప్రయాణించానని పేర్కొన్నారు. రష్మిక తన నటనపై గతంలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె హిందీ యాక్సెంట్పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆమె సినిమా ఎంపికలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ అవార్డు ఆ విమర్శలకు సమాధానంగా నిలిచినట్లు భావిస్తున్నారు.
ఈ వేడుకకు రష్మిక తన అత్త మాధవి దేవరకొండతో కలిసి హాజరయ్యారు. రష్మిక అవార్డు స్వీకరిస్తూ ప్రసంగం చేస్తున్న సమయంలో మాధవి ఆమెకు ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రష్మిక మాట్లాడుతూ.. అప్పుడు నేను మీ ముందుకు ఒక కుమార్తెగా వచ్చాను. ఇప్పుడు మీ ముందు కోడలిగా నిలబడ్డాను. ఇది నాకు ఎంతో గర్వకారణం.. అని అన్నారు. ఇక హైదరాబాద్లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్కు ముందు మార్చి 4న రష్మిక, విజయ్ దేవరకొండ మీడియాను కలిశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు ఒక కొత్త కోడలు వచ్చింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి.. అని అన్నారు.
ఈ జంట ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయం విజయ్ సంప్రదాయాన్ని గౌరవిస్తూ తెలుగు పద్ధతిలో వివాహం చేసుకోగా, సాయంత్రం రష్మిక సంప్రదాయం ప్రకారం కొడవ శైలిలో వివాహం నిర్వహించారు. వివాహంపై మొదట మౌనం పాటించిన ఈ జంట, ఫిబ్రవరి 23 నుంచి తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు ఈ నగరానికి ఏమైంది దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, ది గర్ల్ఫ్రెండ్ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్, నటీమణులు ఈషా రెబ్బా, ఆశిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, లోకా చిత్ర నటి కల్యాణి ప్రియదర్శన్ తదితరులు హాజరయ్యారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ 2018లో విడుదలైన గీత గోవిందం సినిమా సెట్స్లో తొలిసారి కలుసుకున్నారు. అనంతరం 2019లో డియర్ కామ్రేడ్ చిత్రంలో కలిసి నటించారు. గీత గోవిందం సినిమా భారీ బ్లాక్బస్టర్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.132 కోట్ల వసూళ్లు సాధించింది.
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ…
వ్యాపార వేత్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న అనంతరం హన్సిక మోత్వాని గోల్డెన్ టెంపుల్ను సందర్శించి ఇన్స్టాగ్రామ్లో కీలక పోస్టు…