గత కొంత కాలంగా సమంత మయోసైటిస్ అనే తీవ్ర సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా వెళ్లిన సమంత కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇండియాకు వచ్చీ రాగానే ఒక డాగ్ ఫుడ్ యాడ్ చేసింది. అందులో ఆమె పూర్తిగా మారిపోయిన ముఖాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తన ముఖానికి సర్జరీ చేయించుకుందని.. అందుకనే చాలా కాలం పాటు అందరికీ దూరంగా ఉందని అర్థమైంది. అయితే ఆ తరువాత వెంటనే ఆమె హాస్పిటల్లో చేరి అందరినీ షాక్కు గురి చేసింది.
హాస్పిటల్ బెడ్పై తన కొత్త సినిమా యశోదకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సమంత షేర్ చేసింది. అలాగే తనకున్న వ్యాధి వివరాలను కూడా పోస్ట్ లో పెట్టింది. తనకు మయోసైటిస్ ఉందని, చికిత్స తీసుకుంటున్నానని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ కాగా.. అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఆమెకు బెస్టాఫ్ లక్ చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం సమంత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది. ఈ క్రమంలోనే ఓ ఫొటోషూట్ కూడా చేసింది. అందులో ఆమె నలుపు రంగు దుస్తులను ధరించి అద్దాలు పెట్టుకుని ఉంది. తన రాబోయే సినిమా యశోద కోసం ఆమె ప్రమోషన్స్ నిర్వహిస్తుందని తెలుస్తోంది.
అందులో భాగంగానే ఆమె యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసిందట. అది త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన యశోద మూవీ ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుండగా.. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో భ్రూణ హత్యలు, సరోగసి వంటి అంశాలు ఉన్నట్లుగా ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. ఇక నాగచైతన్య నుంచి విడిపోయాక సమంత నటించిన తమిళ మూవీ కాతు వాకుల రెండు కాదల్ రిలీజ్ అయి ఫెయిల్ కాగా.. ఇప్పుడు విడుదలవుతున్న యశోద మూవీ రెండవది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…