Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తూ.. అదుపు తప్పి కింద పడ్డ విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. కాలర్ బోన్ విరగడంతో అపోలో బృందం విజయవంతంగా సర్జరీ నిర్వహించింది. కొద్ది రోజులుగా తేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. పలు మీడియా సంస్థలు కూడా సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నాగబాబు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ ఆరోగ్యంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతోంది. మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూటింగ్లకు కూడా హాజరు కావచ్చు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగబాబు అన్నారు.
రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపిస్తూ ట్వీట్ చేశారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి ‘థాంక్స్’ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. కాగా సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…