Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తూ.. అదుపు తప్పి కింద పడ్డ విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. కాలర్ బోన్ విరగడంతో అపోలో బృందం విజయవంతంగా సర్జరీ నిర్వహించింది. కొద్ది రోజులుగా తేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. పలు మీడియా సంస్థలు కూడా సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నాగబాబు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ ఆరోగ్యంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతోంది. మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూటింగ్లకు కూడా హాజరు కావచ్చు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగబాబు అన్నారు.
రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపిస్తూ ట్వీట్ చేశారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి ‘థాంక్స్’ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. కాగా సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…