KBC : కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 13 వ సీజన్ ను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా అమితాబ్ తన హోస్టింగ్ టాలెంట్ తో ఎంతోమందిని గెలిపించి సందడి చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కి సెలెబ్రిటీలు రావడం కూడా మరో స్పెషాలిటీ. అలా ఈ ప్రోగ్రామ్ కి లేటెస్ట్ గా రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలు వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.
ఫన్నీ రీల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈ అందమైన జంట అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ప్రముఖ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని పేద పిల్లలకు డొనేట్ చేస్తుంటారు. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు హెల్ప్ చేయాలంటే ఓ వీడియోని రితేష్, జెనీలియాలకు చూపించారు. ఆ వీడియోకి చలించిపోయిన ఈ జంట కన్నీరు పెట్టుకుంటూ ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఆ భగవంతుడు ఇంత శిక్ష విధించారని బావోధ్వేగానికి లోనయ్యారు.
అలాగే అమితాబ్ బచ్చన్ అలాంటి పిల్లల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అంతకుముందు ఎపిసోడ్స్ లో దీపికా పదుకునే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి లాంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రెటీలు అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల చికిత్స కోసం డొనేట్ చేస్తూ వారి ఆరోగ్యం బాగుండాలని.. అమితాబ్ బచ్చన్ చేస్తున్న పనిలో తాము కూడా పార్టిసిపేట్ చేసినందుకు.. ఆనందం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…