KBC : కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా 13 వ సీజన్ ను అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా అమితాబ్ తన హోస్టింగ్ టాలెంట్ తో ఎంతోమందిని గెలిపించి సందడి చేశారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కి సెలెబ్రిటీలు రావడం కూడా మరో స్పెషాలిటీ. అలా ఈ ప్రోగ్రామ్ కి లేటెస్ట్ గా రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలు వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.
ఫన్నీ రీల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఈ అందమైన జంట అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ప్రముఖ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని పేద పిల్లలకు డొనేట్ చేస్తుంటారు. అలాగే క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలకు హెల్ప్ చేయాలంటే ఓ వీడియోని రితేష్, జెనీలియాలకు చూపించారు. ఆ వీడియోకి చలించిపోయిన ఈ జంట కన్నీరు పెట్టుకుంటూ ఆ పిల్లలు ఏం పాపం చేశారని ఆ భగవంతుడు ఇంత శిక్ష విధించారని బావోధ్వేగానికి లోనయ్యారు.
అలాగే అమితాబ్ బచ్చన్ అలాంటి పిల్లల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. అంతకుముందు ఎపిసోడ్స్ లో దీపికా పదుకునే, ఫరా ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి లాంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రెటీలు అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ లో వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో సెలెబ్రిటీలు గెలుచుకున్న డబ్బుని క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లల చికిత్స కోసం డొనేట్ చేస్తూ వారి ఆరోగ్యం బాగుండాలని.. అమితాబ్ బచ్చన్ చేస్తున్న పనిలో తాము కూడా పార్టిసిపేట్ చేసినందుకు.. ఆనందం వ్యక్తం చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…