Painting : ఉద్యోగంలో చేరిన తొలి రోజే ఓ సెక్యూరిటీ గార్డు కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్ను చెడగొట్టేశాడు. ఆ ఉద్యోగం అతనికి చాలా బోరింగ్గా ఉందని చెప్పి అతను ఆ విధంగా చేశాడు. దీంతో అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అతనికి జాబ్ ఇచ్చిన కంపెనీ లక్షల రూపాయలు ఫైన్ కట్టడంతోపాటు ఆ పెయింటింగ్ను బాగు చేసే పనిలో పడింది. వివరాల్లోకి వెళితే..
పశ్చిమ-మధ్య రష్యాలోని స్వెర్డ్లోవ్స్క్ ఆబ్లాస్ట్ ప్రాంతంలో ఉన్న యెల్ట్సిన్ సెంటర్లో ఓ పెయింటింగ్ను ఈ మధ్యే ప్రదర్శనకు ఉంచారు. అది 1932 కాలానికి చెందినది. అన్నా లెపర్స్కయా అనే మహిళ ఆ పెయింటింగ్కు యజమాని. ఆ పెయింటింగ్ను త్రీ ఫిగర్స్ పేరిట పిలుస్తున్నారు. దీన్ని డిసెంబర్ 7, 2021వ తేదీన అక్కడి ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. తరువాత యెల్ట్సిన్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచారు.
అయితే ఆ సెంటర్కు ఇటీవలే ఓ సెక్యూరిటీ గార్డు నియామకం అయ్యాడు. అతని వయస్సు 60 ఏళ్లు. కాగా అతను ఉద్యోగంలో చేరిన తొలిరోజే జాబ్ చాలా బోరింగ్గా ఉందని చెప్పి ఆ త్రీ ఫిగర్స్ పెయింటింగ్పై పెన్నుతో పిచ్చి గీతలు గీశాడు. ఆ పెయింటింగ్లో ముగ్గురు వ్యక్తుల ముఖాలు ఉంటాయి. కానీ వారికి కళ్లు, ముక్కు, నోరు లాంటివి ఏవీ ఉండవు. ముఖం ఖాళీగా ఉంటుంది.
ఈ క్రమంలోనే ఆ సెక్యూరిటీ గార్డు ఆ ముగ్గురు వ్యక్తుల చిత్రాల్లో ఇద్దరి ముఖాలపై బాల్ పాయింట్ పెన్నుతో కళ్లను గీశాడు. దీంతో పెయింటింగ్ మొత్తం చెడిపోయింది. అయితే సదరు సెంటర్ వారు ఆ సెక్యూరిటీ గార్డును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే వారు ఆ పెయింటింగ్ ఓనర్కు రూ.39,900 ఫైన్ చెల్లించారు. ఇక కొందరు నిపుణులైన పెయింటర్లను పెట్టి దాన్ని బాగు చేయించే పని చేస్తున్నారు. అందుకు గాను రూ.2,49,500 వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఆ పెయింటింగ్ ఖరీదు అక్షరాలా 1 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపుగా రూ.7.47 కోట్లు. కాగా దానికి ఇన్సూరెన్స్ సైతం ఉంది. ఆ పెయింటింగ్ను వారు బాగు చేయలేకపోతే ఓనర్కు ఆ మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అంటే.. ఎటు తిరిగి ఆ సెంటర్ వారికే నష్టమన్నమాట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…