7 Days 6 Nights Movie : నిర్మాత ఎంఎస్ రాజు పేరు చెబితే చాలు మనకు హిట్ చిత్రాలైన.. శత్రువు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. వంటి మూవీలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ నిర్మాతల్లో ఈయన టాప్ ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపు పొందారు. అయితే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న చందంగా.. ఎంఎస్ రాజు పరిస్థితి కూడా మారింది. ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అయింది. దీంతో ఆయన మరోబాట పట్టారు. అడల్ట్ కంటెంట్నే నమ్ముకున్నారు.
గతంలో ఆయన వాన, తూనీగ తూనీగ వంటి చిత్రాలను తీయగా.. అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆయన తన కంటెంట్ను మార్చారు. అడల్ట్ కంటెంట్కు ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ క్రమంలోనే డర్టీ హరి పేరిట ఓ సినిమాను తీసి వదిలారు. అది మంచి టాక్ సాధించింది. ఈ మూవీకి ఆయన ఏకంగా దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. దీంతో అదే బాటలో ఇంకో అడల్ట్ మూవీని మళ్లీ తెరకెక్కిస్తున్నారు.
ఎంఎస్ రాజు తాజాగా 7 డేస్ 6 నైట్స్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. అందులో ఘాటు సీన్లతో అరాచకం సృష్టించారు. అందాల ఆరబోతలో హీరోయిన్స్ ఇద్దరూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేశారు. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ ప్రస్తుతం యూత్ను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ మూవీలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా, మెహర్ చాహల్, కృతిక శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇక ట్రైలర్ను చూస్తే చాలు.. సినిమా పూర్తిగా రొమాన్స్తో నిండిపోయి ఉందని అర్థమవుతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకనే ఎంఎస్ రాజు మళ్లీ దాదాపుగా డర్టీ హరి లాంటి కథాంశంతో ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ మూవీని సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు. కానీ కుదరలేదు. ఇక దీని కథ విషయానికి వస్తే.. గోవా ట్రిప్కు వెళ్లిన ఇద్దరు అబ్బాయిలు అక్కడి అమ్మాయిలతో చేసిన రొమాన్స్, ఇతర అంశాలు.. ఉంటాయి. ఏదో ఒక ఊహించని సంఘటన జరుగుతుందని మాత్రం ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. కాగా ఈ మూవీని అతి త్వరలోనే విడుదల చేయనున్నారు. ఓటీటీలో లేదా థియేటర్లలో.. ఎందో ఈ మూవీ విడుదల కానుందో త్వరలో ప్రకటించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…