Khiladi Movie : రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రవితేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ఈ సినిమాకు పనిచేసిన అందరినీ పొగిడారు. అందరు టెక్నిషియన్లను మెచ్చుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా వారికే చెందుతున్నారు. అయితే నిర్మాత కోనేరు సత్యనారాయణ గురించి మాట్లాడుతూ.. ప్రతి ప్రొడ్యూసర్ సినిమాకు డబ్బులు పెట్టి చూస్తూ ఊరుకోవద్దని, దగ్గరుండి అన్నీ చూసుకోవాలని, చాలా విషయాలు తెలుస్తాయని అన్నారు. ఇక దర్శకుడు రమేష్ వర్మ గురించి రవితేజ పెద్దగా మాట్లాడలేదు.
సాధారణంగా ఏ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అయినా సరే.. నిర్మాత, దర్శకులను హీరోలు, హీరోయిన్లు, అందుకు పనిచేసినవారు మెచ్చుకుంటుంటారు. కానీ రవితేజ మాత్రం ఇందుకు భిన్నంగా కామెంట్స్ చేశారు. నిర్మాతపై ఆ విధంగా మాట్లాడారు. ఇక దర్శకుడి గురించి అయితే పెద్దగా చెప్పలేదు. దీంతో దర్శకుడు రమేష్ వర్మకు, రవితేజకు పడడం లేదనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అందుకనే రవితేజ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా సరిగ్గా హాజరు కాలేదట. డబ్బింగ్కు టైముకు చేరుకోలేదట. అలాగే ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొనడం లేదని తెలిసింది.
ఖిలాడి మూవీ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసిందని.. లాభాలు బాగానే వచ్చాయని చెబుతూ నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇదే రవితేజకు నచ్చలేదని.. సినిమా విడుదలయ్యాక అలా చేస్తే ఓకే.. కానీ విడుదలకు ముందే ఇలా చేస్తే అవనసర ఆడంబరాలకు పోయినట్లు ఉంటుందని.. రవితేజ భావించారట. కనుకనే ఆయన దర్శకుడితో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలిసింది. అయితే చిత్ర యూనిట్ చెబుతున్నట్లు నిజంగానే ఈ మూవీ బాగానే బిజినెస్ చేసినట్లయితే.. సినిమా బాగా ఆడాలి. మరి ఈ మూవీ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుందో చూడాలి.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిధిలోని ISSA యూనిట్ ఒక సంవత్సరం కాల వ్యవధి గల అప్రెంటిస్ శిక్షణ…
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు…
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…