Tollywood : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలోనే నాగార్జున, చిరంజీవి పలుమార్లు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి మరోమారు సీఎం జగన్తో సమావేశం అయ్యారు. అయితే ఈ సారి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. కాగా వారందరూ సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక చిరంజీవి గతంలోనే పలు మార్లు సీఎం జగన్ను కలిశారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ను కలవడం, తాజా సమావేశంలో పలువురు అగ్ర హీరోలు కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్ఆర్ఆర్ తోపాటు భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విషయం తేల్చకపోతే ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కలసి సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారందరూ విజయవాడకు తరలివెళ్తున్నప్పుడు ప్రైవేటు జెట్లో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…