Tollywood : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలోనే నాగార్జున, చిరంజీవి పలుమార్లు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి మరోమారు సీఎం జగన్తో సమావేశం అయ్యారు. అయితే ఈ సారి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. కాగా వారందరూ సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక చిరంజీవి గతంలోనే పలు మార్లు సీఎం జగన్ను కలిశారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ను కలవడం, తాజా సమావేశంలో పలువురు అగ్ర హీరోలు కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్ఆర్ఆర్ తోపాటు భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విషయం తేల్చకపోతే ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కలసి సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారందరూ విజయవాడకు తరలివెళ్తున్నప్పుడు ప్రైవేటు జెట్లో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…