Tollywood : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సినిమా టిక్కెట్ల ధరలను భారీగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. ఈ క్రమంలోనే నాగార్జున, చిరంజీవి పలుమార్లు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఇక తాజాగా చిరంజీవి మరోమారు సీఎం జగన్తో సమావేశం అయ్యారు. అయితే ఈ సారి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. కాగా వారందరూ సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
ఇక చిరంజీవి గతంలోనే పలు మార్లు సీఎం జగన్ను కలిశారు. సినీ రంగ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ను కలవడం, తాజా సమావేశంలో పలువురు అగ్ర హీరోలు కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆర్ఆర్ఆర్ తోపాటు భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్3 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విషయం తేల్చకపోతే ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కనుక అందరూ కలసి సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారందరూ విజయవాడకు తరలివెళ్తున్నప్పుడు ప్రైవేటు జెట్లో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ సమావేశం తరువాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…