Renu Desai : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల అంశం ప్రత్యర్థులకు ఎప్పటి నుంచో ఆయుధంగా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రత్యర్థులకు ఘాటుగా ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాడు. అవునూ నేను 3 పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి చేసుకున్నాను. అలాగే మాజీ భార్యలకు చేయాల్సి న్యాయం చేశానన్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ వైఫ్ నందికి రూ. 5 కోట్ల భరణం ఇచ్చాను. రేణూ దేశాయ్ కి మిగిలిన నా ఆస్తి రాసిచ్చాను అన్నారు. నండినికి రూ. 5 కోట్లు చెల్లించినట్లు పవన్ బయటపడ్డాడు.
అది ఓకే కానీ రేణూ విషయంలోనే ఆయన కామెంట్ కరెక్ట్ గా లేదు. 2012లో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ తన ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నాడు. పవన్ కామెంట్స్ విన్నాక రేణు దేశాయ్ ని తప్పుబట్టాల్సి వస్తుంది. పాపం పవన్ కళ్యాణ్ పై ఆమె అన్యాయంగా ఆరోపణలు చేసినట్లు రుజువవుతుంది. విడాకులు తీసుకున్నందుకు కోట్ల ఆస్తి అప్పగిస్తే.. రేణూ మాత్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పింది. పవన్ కళ్యాణ్ నాకు రూపాయి కూడా ఇవ్వలేదు. నా స్వశక్తితో పిల్లల పోషణ, చదువు, బాధ్యతలు నెరవేర్చుతున్నాను. నేను 15 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చాను. 19 ఏళ్లకు సొంతగా ఫ్లాట్ కొనుక్కున్నాను. రైటర్, డైరెక్టర్, ఇన్వెస్టర్, డిజైనర్ గా డబ్బులు సంపాదించాను.
పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇచ్చారు, నేను సినిమాలు నిర్మించాను అనేది పుకారు మాత్రమే. నా తెలివితేటలతో నేను అనేక మార్గాల్లో డబ్బులు సంపాధించానని రేణూ దేశాయ్ గతంలో చెప్పారు. ఈ క్రమంలో ఎవరు అబద్దం చెప్పినట్లు? రేణూ దేశాయ్ కి కోట్ల ఆస్తి రాసిచ్చానని పవన్ అబద్దం చెప్పాడా? లేక పవన్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదని రేణూ దేశాయ్ అబద్ధం చెప్పిందా..? ప్రస్తుతం పవన్-రేణు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పవన్ కామెంట్ వివాదాస్పదం కాలేదు. లేదంటే పవన్ స్టేట్మెంట్ పై రేణూ దేశాయ్ ఖచ్చితంగా స్పందించేవారు. భవిష్యత్ లో రేణూ దేశాయ్ ఇంటర్వ్యూలో పాల్గొంటే ఆమెకు ఈ ప్రశ్న తప్పకుండా ఎదురయ్యే అవకాశం ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…