Priyamani : వల్లభ హీరోగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. తరువాత ప్రియమణి జగపతి బాబు సరసన నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి స్టార్ స్టేటస్ ఏర్పడింది. ఇటీవల విరాట పర్వంలో కూడా నటించింది. అలాగే ప్రియమణి చేసిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. మరోవైపు ప్రియమణి బుల్లితెర షోల ద్వారా తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.
అయితే 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకుని ఐదేళ్లు దాటిపోయింది. ఇద్దరూ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. కానీ ఇటీవలకాలంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగిపోయాయని.. వీళ్లిద్దరూ విడిపోయి.. వేర్వేరుగా ఉంటున్నారు అని, అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పటికప్పుడు ఆమె టీమ్ వాటిని ఖండిస్తూనే ఉంది. ఈ విషయం ప్రియమణి కూడా గమనించినట్లు ఉంది. రీసెంట్ గా ఓ వీడియోని తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసింది. అందులో ఆమె మాధవన్ రాక్రెట్రీ చిత్రం సక్సెస్ పార్టీలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనపడింది.
ఇంతకు మించి వీరి బంధం వీగలేదు అనటానికి రుజువు ఏమి కావాలి? అలాగే ఇన్ స్టా ఎక్కౌంట్ లో Priya Mani Raj అనే పేరే ఉంది. మరో ప్రక్క ప్రియమణి చేతి నిండా ఆఫర్స్ తో వరుస సినిమాలు, గేమ్ షోలు చేస్తుంది. భర్త ముస్తఫా రాజ్ అమెరికాలో ఆయన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నాడు. అయితే ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయినా వాటి ఇంపాక్ట్.. వీరి వైవాహిక జీవితంపై లేదని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…