Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చిందన్న విషయం తెలిసిందే. ఇందులో గుర్తింపు పొందిన అనేకమంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే కొన్ని కారణాలతో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ షో కళకళలాడుతోంది. కమెడియన్స్ అంతా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం అలా తిరిగి రాలేదు. పౌరుషంగా అక్కడే ఉంటూ జబర్దస్త్ షోని మించి పోయేలా కొత్త షోలు రావడానికి ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఛానల్ ఈటీవీలో వర్క్ చేస్తున్న స్టార్ కమెడియన్స్ ని ఆ షోలో పని చేస్తున్న జడ్జీలని మెల్లగా వాళ్ళ వైపులా తిప్పుకునేందుకు భారీ ఆఫర్స్ ఇస్తుంది ఓ స్టార్ ఛానెల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఉంటున్న హైపర్ ఆదిపై ఆ ఛానల్ కళ్ళు పడ్డాయట. దీంతో అతనికి భారీ పారితోషకం ఆఫర్ చేస్తూ ఈటీవీని వదిలి వచ్చేసి మా ఛానల్ లో పనిచేయాలి అంటూ హైపర్ ఆదిని కోరారట.
అయితే హైపర్ ఆది యస్, నో ఏదీ చెప్పకుండా.. టైం కావాలి అన్నట్లు చెప్పుకొచ్చాడట. ఈ మ్యాటర్ తెలుసుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ హైపర్ ఆదిని పిలిచి వార్నింగ్ ఇచ్చిందట. అంతేకాదు నువ్వు షో వదిలి వెళ్ళడానికి వీల్లేదు.. అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ చేసావ్ గుర్తుంది కదా అంటూ హెచ్చరిచిందట. అంతేకాదు.. వాళ్లకు మించిపోయే ఆఫర్ ను ఇవ్వడానికి సిద్ధపడిన్నట్లు తెలుస్తుంది. దీంతో హైపర్ ఆది ఆ ఛానల్ లోకి వెళ్తాడా లేక ఈ ఛానల్ లోనే ఉంటాడా లేదా.. గోడ మీద పిల్లిలా అటు ఇటు మారుతూ ఉంటాడా..? అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…