Singer Chinmayi : పెళ్లైన 4 నెలలకే తాము కవలలకు తల్లిదండ్రులయ్యాం అంటూ నయన్ దంపతులు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సరోగసి వివాదం ముదిరిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సరోగసి విమర్శలు ఎదుర్కొంటుంది. నయన్ దంపతుల నుంచి ఈ వివాదం చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ దంపతుల వైపు మళ్ళింది. వీరిద్దరు ఈ ఏడాది జూన్లో కవలలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకునే చిన్మయి.. తల్లి కాబోతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఈ జంట సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులయ్యారంటూ తెలిసీ తెలియకుండా కామెంట్లు చేస్తూ వచ్చారు నెటిజన్లు. ఇక రీసెంట్ గా ఈ విమర్షలపై తనదైన స్టైల్ లో స్పందించింది చిన్మయి.
కేవలం ఒక్క ఫోటోతో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది స్టార్ సింగర్. వీటితోపాటు తన బేబీ బంప్ ఫొటోను సైతం పోస్టు చేసింది. ఇక తన ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలుపడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. అందరికి అనుమానం వీడిపోయేలా.. ఈ పిల్లలు తమ పిల్లలే అని నిరూపించేలా… చెప్పకనే చెప్పింది చిన్మయి. తన ఇన్స్టాగ్రామ్ పేజిలో వీడియో, ఫొటోలను షేర్ చేసింది. ఫోటోలు షేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చింది చిన్మయి. 32 వారాల తర్వాత నా ఫొటోను మీతో ఇప్పుడే పంచుకుంటున్నాను. వీలైనన్ని ఫొటోలు తీసుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే, దీని వెనకున్న కారణాన్ని ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాను. మొదటిసారి గర్భస్రావమైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను.
ఆ ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. డబ్బింగ్, రికార్డింగ్ సమయాల్లో నా ఫొటోలు, వీడియోలు తీయొద్దని చెప్పాను. అందుకే నేను తల్లైన విషయాన్ని చెప్పకుండా దాచాను అని చెప్పుకొచ్చింది చిన్మయి. ఇక నేను ఫోటోలు పెట్టలేదు.. విషయం చెప్పలేదు అని తనపై సరోగసి అని వస్తున్న ప్రశ్నలకు ఇదే నా సమాధానం. సరోగసి, ఐవీఎఫ్, సహజ గర్భం ఇలా ఏ రూపంలో అయినా పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు. అమ్మ అంటే అమ్మ అంతే. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏమనుకున్నా.. అది వాళ్ల అభిప్రాయం. నాకు ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు. ఈరకంగా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది చిన్మయి శ్రీపాద.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…