Rashmika Mandanna : వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న రష్మిక మందన్న ప్రస్తుతం నేషనల్ క్రష్గా మారింది. ఈమె నటిస్తున్న సినిమాలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో రష్మికను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన పుష్ప మూవీలో రష్మిక మందన్న శ్రీవల్లిగా నటనను ఇరగదీసిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఆమె కెరీర్ జోరు మీదుంది.
ఇక రష్మిక మందన్న ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. మిషన్ మజ్ను, గుడ్ బై అనే చిత్రాల ద్వారా ఆమె బాలీవుడ్ తెరకు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని భాషల్లోనూ నటిస్తున్న రష్మికకు అనేక నగరాలకు తిరగడం కష్టంగా మారిందట. దీంతో ఆమె పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రష్మిక మందన్న ఇటీవలే ముంబైలో ఓ పోష్ ఏరియాలో ఇంటిని కొనుగోలు చేయగా.. తాజాగా హైదరాబాద్లోనూ మరో ఇంటిని కొన్నదట. ఇందుకు గాను ఆమె భారీగానే ఖర్చు చేసిందని సమాచారం. హైదరాబాద్లోని ఓ లగ్జరీ ఏరియాలో ఆమె ఇంటిని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఆమె పలు భాషలకు చెందిన చిత్రాల్లో నటిస్తుండడంతో.. ఎక్కువగా ఆయా నగరాలకు తిరగాల్సి వస్తోంది. దీంతో ఆమెకు స్టే చేసేందుకు హోటల్స్ పడడం లేదట. అందుకనే ఆయా సిటీల్లో ఇళ్లను కొనుగోలు చేసిందని సమాచారం.
ప్రస్తుతం రష్మిక మందన్న బాలీవుడ్ చిత్రాలతోపాటు పుష్ప రెండో భాగంలో నటిస్తోంది. ఏది ఏమైనా 2021, 2022 సంవత్సరాలు రష్మికకు బాగా కలసి వచ్చాయనే చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…