Whatsapp : నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రతి నెలా అలాంటి ఎన్నో లక్షల మంది యూజర్లను వాట్సాప్ నిషేధిస్తోంది. ఇక వాట్సాప్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కేవలం డిసెంబర్ నెలలోనే 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడైంది.
డిసెంబర్ నెలలో మొత్తం 528 ఫిర్యాదులు అందాయని.. ఆ మేరకు మొత్తం 20 లక్షల ఖాతాలను నిషేధించామని వాట్సాప్ తెలియజేసింది. ఇక నవంబర్ నెలలో 17.5 లక్షల ఖాతాలను నిషేధించింది. సదరు యూజర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. యూజర్లకు బల్క్ మెసేజ్లను పంపిస్తున్నారని.. అందుకనే ఆ ఖాతాలను నిషేధించడం జరిగిందని వాట్సాప్ తెలియజేసింది.
ఇక డిసెంబర్ నెలలో మొత్తం 528 ఫిర్యాదులు అందగా.. వాటిలో 303 మంది నిషేధాన్ని ఎత్తివేయాలని కోరినట్లు తెలిపింది. గతేడాది మే నెల నుంచి వాట్సాప్ ఈ విధంగా చర్యలు తీసుకుంటోంది. దేశంలో చెలామణీలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ ఇలాంటి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నెల నెలా నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయా సంస్థలు ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలి. వారు కేంద్రానికి సమాచారం అందించాల్సి ఉంటుంది.
వాట్సాప్లో ప్రైవసీకి పెద్ద పీట వేశామని ఆ సంస్థ మరోమారు స్పష్టం చేసింది. యూజర్లకు పెద్ద ఎత్తున కొందరు బల్క్ మెసేజ్లను పంపిస్తున్నారని.. అది నిబంధనలకు విరుద్ధమని.. అందుకనే చర్యలు తీసుకున్నామని.. వాట్సాప్ తెలియజేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…