Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా మహేష్ చేయబోయే తదుపరి చిత్రాన్ని గురువారం లాంచ్ చేశారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబినేషన్లో మహేష్ తదుపరి చిత్రం గురువారం లాంచ్ అయింది. మహేష్ బాబు 28వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అతడు, ఖలేజా తరువాత త్రివిక్రమ్ మళ్లీ మహేష్తో చేస్తున్న సినిమా ఇది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ను సాధించాయి. దీంతో మహేష్ బాబు, త్రివిక్రమ్ల కాంబినేషన్పై మళ్లీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖలేజా నిరాశ పరిచినా.. ఈ సారి త్రివిక్రమ్ మహేష్ను కొత్తగా చూపించనున్నారని సమాచారం. దీంతో మహేష్ బాబు 28వ చిత్రం హిట్ పక్కా అని అంటున్నారు.
ఇక గురువారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి మహేష్ హాజరు కాలేదు. ఆయన తన సినిమాల లాంచింగ్కు హాజరు కారు. ఇది ఆయనకు ఒక సెంటిమెంట్. అయితే ఈ మూవీ లాంచింగ్కు మహేష్ భార్య నమత్ర హాజరయ్యారు. తొలి సీన్కు ఆమె క్లాప్ కొట్టారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. మహేష్, పూజా కలిసి నటించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వీరి కాంబినేషన్ మరోమారు హిట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…