Ram Gopal Varma : ఒకప్పుడు శివ లాంటి చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిన్నాచితకా సినిమాలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఆయన సినిమాలు ఎక్కువగా వివాదాలు సృష్టిస్తుంటాయి. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా వాటిని సాల్వ్ చేసి విడుదల చేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన నైనా గంగూలీ, అప్సర రాణి ముఖ్యపాత్రల్లో డేంజరస్ అనే మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాని ఈ నెల 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకి సంబంధించి కొద్ది రోజులుగా ప్రమోషన్స్ జరుపుతుండగా, ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చాయి థియేటర్ యాజమాన్యాలు.
థియేటర్స్, మల్టీప్లెక్స్ లకు సంబంధించిన యాజమాన్యాలు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ వంటి వివాదాస్పద చిత్రాన్నిథియేటర్స్లో ప్రదర్శించబోమంటూ తెగేసి చెప్పాారు. మొత్తంగా ఒకప్పడు తన సినిమాలతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఈ దిగ్గజ దర్శకుడికి ఇంత కంటే అవమానం మరొకటి ఉండంటున్నారు ప్రేక్షకులు. ఇక థియేటర్స్ యాజమాన్యాలు తన సినిమాను తిరస్కరిస్తే .. ఓటీటీ లేదా నేరుగా యూట్యూబ్లో రిలీజ్ చేసినా చేసే రకం రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తవగా, ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. థియేటర్లు సహకరించకపోవడంతో తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నామంటూ ఆర్జీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇవ్వడంతో.. రిలీజ్ పై వెనకడుగు వేశారు వర్మ. ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర కథ మూలాన చాలా థియేటర్స్ నాన్ కో-ఆపరేషన్ దృష్ట్యా ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నాము. అన్ని విధాలుగా ఈ అన్యాయంని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత మరో విడుదల తేదీ తెలియజేస్తాను.. మీ రామ్ గోపాల్ వర్మ.. అంటూ ట్వీట్ చేశారు వర్మ. నట్టి కుమార్ వేసిన పిటిషన్ వలన కూడా వర్మ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదలకు నోచుకుంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…