Naga Babu : పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక పేరు బయటకు రావడంతో ఈ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతోంది. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసు బృందాలు, అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది యువతీ యువకులను అరెస్ట్ చేశారు. పబ్ నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాగా డబ్బున్న పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండే ఈ పుడింగ్ మింక్ పబ్ ఏర్పాటు చేసిన లేట్ నైట్ పార్టీలో సింగర్ రాహుల్ సింప్లి గంజ్, నిహారిక కొణిదెలతోపాటు పలువురు ప్రముఖుల వారసులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.
తెల్లవారుజాము కావడంతో మీడియా కంట పడకుండా చాలా మంది ప్రముఖులు పిల్లలు పైరవీల ద్వారా తప్పుకున్నారు అని సమాచారం.అయితే నిహారిక అడ్డంగా బుక్ కావడంతో ఆమెపై అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇక పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎటువంటి స్పెక్యులేషన్స్ ప్రచారం చేయొద్దని వీడియో ద్వారా కోరారు. అయినప్పటికీ శ్రీ రెడ్డి, శ్వేతారెడ్డితోపాటు పలువురు యాంటీ మెగా పర్సన్స్ బురదజల్లుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో స్పందించిన నాగబాబు ఒక్క వీడియోతో పుకార్లన్నింటికీ పుల్ స్టాప్ పెట్టాడు. కుక్కలు అలానే మొరుగుతుంటాయి అని అర్ధం వచ్చేలా ఓ పాపులర్ ఆల్బమ్లోని హూ లెట్స్ ది డాగ్స్ ఔట్ అనే వీడియో పోస్ట్ చేశాడు. దీనితో నాగబాబు పుకార్లు పుట్టించే వారికి గట్టిగా సమాధానం ఇచ్చాడని కొందరు చెబుతున్నారు. అసలు నిహారిక డ్రగ్స్ తీసుకుందా ? లేదా ? అనేది పక్కన పెడితే ఒక పెళ్ళైన అమ్మాయి, కనీసం భర్త పక్కన లేకుండా పబ్ లు, పార్టీలలో పాల్గొనడం ఏమిటి ? అది కూడా డ్రగ్స్ వినియోగిస్తున్న లేట్ నైట్ పార్టీలలో ఎంజాయ్ చేయడమేమిటి ? అంటూ నెటిజెన్స్ నిలదీస్తున్నారు. ఈ కోణంలో నాగబాబును వారు టార్గెట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…