Priyamani : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ కలిసి పని చేసిన అందాల ముద్దుగుమ్మ ప్రియమణి పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది. దశాబ్దం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలతో, వెబ్ సిరీస్లతో బిజీ అయిపోయింది. రెండేళ్ల క్రితం విడుదలయిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తనను మరోసారి హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. హిందీలోనే కాదు సౌత్లో కూడా ప్రియమణి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ.. మొదలైన తెలుగు చిత్రాలలో నటించింది.
తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మళయాళీ, తమిళ భాషల్లో నటించింది. ఇక 2017లో ముస్తఫా రాజ్ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. గతేడాది నారప్పతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా భామాకలాపం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇందులో ప్రియమణి నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో ప్రియమణి రెమ్యునరేషన్ పెంచేసిందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా నడుస్తోంది.
సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉండే ప్రియమణి ఒక్కోసారి పొట్టి దుస్తులలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది. అయితే ఒక్కోసారి తన డ్రెసింగ్పై విమర్శలు వస్తుంటాయి. వీటిపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది ప్రియమణి. తాజాగా సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్తోపాటు, మంచి అందం, స్కిన్ టోన్, ఆకట్టుకునే దుస్తులు, మంచి హెయిర్ స్టైల్ కలిగి ఉండాలని పేర్కొంది. సెలబ్రిటీ బయటకు వచ్చారంటే వారిని తమ కెమెరాలలో బంధిస్తూ ఉంటారు. హీరోయిన్స్ ధరించే బట్టలపై తప్పుడు కామెంట్స్ కాస్త తగ్గించుకుంటే మంచిది. ఆ దుస్తులు కేవలం షోలో అరగంట మాత్రమే ధరిస్తుంటారని.. ప్రజలు దీన్ని తెలుసుకోవాలని తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…