Ram Charan : మెగా అభిమానులతోపాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ఆచార్య. ఈ మూవీ ఈ నెల 29వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే దర్శకుడు కొరటాల శివ, రామ్ చరణ్ తేజ తాజాగా ఈ మూవీ విశేషాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరగనుంది. స్థానికంగా ఉన్న యూసుఫ్ గూడ పోలీస్ మైదానంలో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు చెందిన అనేక విశేషాలను రామ్ చరణ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ మూవీ కోసం తాను తన తండ్రితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. ఆచార్య మూవీ వల్ల తన తండ్రితో కలిసి నటించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని చరణ్ అన్నారు.
ఇక ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందని.. అందుకు కొరటాల శివకు థ్యాంక్స్ చెబుతున్నానని.. చరణ్ అన్నారు. కాగా సినిమాకు వేసిన షూటింగ్ సెట్ నుంచి కాటేజ్కు రోజూ వెళ్లి రావాలని చరణ్ తెలిపారు. కాటేజ్లో తాము బస చేసేవారమని.. ఉదయాన్నే షూటింగ్కు కారులో వెళ్లేవారమని.. కారును కూడా తానే డ్రైవ్ చేసేవాడినని చరణ్ తెలిపారు. ఒకానొక దశలో తన తండ్రితో కలిసి పనిచేస్తున్నానన్న అనుభూతి రాగానే తనకు ఆనంద భాష్పాలు వచ్చేవని.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని.. అలాగే తన తండ్రిని కౌగిలించుకునే వాడినని.. చరణ్ తెలిపారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్తోపాటు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా వస్తారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…