Ram Charan : మెగా అభిమానులతోపాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా.. ఆచార్య. ఈ మూవీ ఈ నెల 29వ తేదీన భారీ ఎత్తున విడుదలవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇక చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే దర్శకుడు కొరటాల శివ, రామ్ చరణ్ తేజ తాజాగా ఈ మూవీ విశేషాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ వేడుకను కూడా చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరగనుంది. స్థానికంగా ఉన్న యూసుఫ్ గూడ పోలీస్ మైదానంలో ఈ ప్రీ రిలీజ్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు చెందిన అనేక విశేషాలను రామ్ చరణ్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ మూవీ కోసం తాను తన తండ్రితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. ఆచార్య మూవీ వల్ల తన తండ్రితో కలిసి నటించే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని చరణ్ అన్నారు.
ఇక ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందని.. అందుకు కొరటాల శివకు థ్యాంక్స్ చెబుతున్నానని.. చరణ్ అన్నారు. కాగా సినిమాకు వేసిన షూటింగ్ సెట్ నుంచి కాటేజ్కు రోజూ వెళ్లి రావాలని చరణ్ తెలిపారు. కాటేజ్లో తాము బస చేసేవారమని.. ఉదయాన్నే షూటింగ్కు కారులో వెళ్లేవారమని.. కారును కూడా తానే డ్రైవ్ చేసేవాడినని చరణ్ తెలిపారు. ఒకానొక దశలో తన తండ్రితో కలిసి పనిచేస్తున్నానన్న అనుభూతి రాగానే తనకు ఆనంద భాష్పాలు వచ్చేవని.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని.. అలాగే తన తండ్రిని కౌగిలించుకునే వాడినని.. చరణ్ తెలిపారు. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్తోపాటు దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా వస్తారని తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…