IPL 2022 : ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నీ 32వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ చాలా అలవోకగా ఛేదించింది. ఇంకా సగం బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ మ్యాచ్ను ముగించింది. పంజాబ్ బౌలర్లను ఢిల్లీ బ్యాట్స్మెన్ ఉతికి ఆరేశారు. తమ టీమ్ కు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే పంజాబ్పై ఢిల్లీ 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో జితేష్ శర్మ ఒక్కడే 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు తలా 2 వికెట్లు చొప్పున తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. పరుగుల మోత మోగించింది. ఢిల్లీ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఢిల్లీ 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో డేవిడ్ వార్నర్ 30 బంతుల్లోనే 10 ఫోర్లు, 1 సిక్సర్తో 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్ల నుంచి పరుగులను పిండుకున్నాడు. అలాగే ఓపెనర్గా వచ్చిన పృథ్వీ షా సైతం ఆకట్టుకున్నాడు. 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్తో 41 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్కు 1 వికెట్ దక్కింది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…