Balakrishna : ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల హంగామా ముగిసింది. ఇక ఇప్పుడు ఆచార్య సందడి మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఆచార్య చిత్రం సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా ఉంటుంది. మాస్ కథకు భారీగా కమర్షియల్ హంగులు అద్దాం.. అని కొరటాల శివ అంటున్నారు. వెండితెరపై చిరు, చరణ్ను కలిపి చూడటం అభిమానులకు పండుగలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది.
ఏప్రిల్29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఆచార్య సినిమా కథ తనదే అంటూ రచయిత రాజేష్ మండూరి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య కథను తాను తన గ్రామంలోని రామాలయంలో జరిగిన ఓ ఘటన ఆదారంగా రాసుకున్నానని.. బాలయ్య హీరోగా ఈ సినిమా చేయాలని తాను భావించినట్టు చెప్పుకొచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి ఈ కథ వినిపించగా, అతడు కథ వినే సమయంలో రికార్డింగ్ చేశాడని చెప్పాడు. అంతే కాకుండా ఈ కథను కొరటాల శివ తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నట్టు తెలిపారు. వారు కథ విని సైలెంట్ గా వెళ్లారని తనకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో నచ్చలేదని అనుకున్నట్టు తెలిపారు. అయితే కొరటాల శివ అదే కథతో సినిమా చేస్తుండడం నాకు షాక్ ఇచ్చింది. ఆ కథ తనదే అని ఈ విషయంపై అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కొరటాలకు కథ పంపానని ఆయన ఆచార్య కథ వేరని చెప్పారని అన్నారు. మొత్తానికి ఈ ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…