Balakrishna : ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల హంగామా ముగిసింది. ఇక ఇప్పుడు ఆచార్య సందడి మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఆచార్య చిత్రం సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా ఉంటుంది. మాస్ కథకు భారీగా కమర్షియల్ హంగులు అద్దాం.. అని కొరటాల శివ అంటున్నారు. వెండితెరపై చిరు, చరణ్ను కలిపి చూడటం అభిమానులకు పండుగలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పాత్ర 30 నిమిషాల పాటు ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది.
ఏప్రిల్29న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సినిమాపై అంచనాలు రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఆచార్య సినిమా కథ తనదే అంటూ రచయిత రాజేష్ మండూరి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య కథను తాను తన గ్రామంలోని రామాలయంలో జరిగిన ఓ ఘటన ఆదారంగా రాసుకున్నానని.. బాలయ్య హీరోగా ఈ సినిమా చేయాలని తాను భావించినట్టు చెప్పుకొచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన చెర్రీ అనే వ్యక్తికి ఈ కథ వినిపించగా, అతడు కథ వినే సమయంలో రికార్డింగ్ చేశాడని చెప్పాడు. అంతే కాకుండా ఈ కథను కొరటాల శివ తెరకెక్కిస్తే బాగుంటుందని అన్నట్టు తెలిపారు. వారు కథ విని సైలెంట్ గా వెళ్లారని తనకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో నచ్చలేదని అనుకున్నట్టు తెలిపారు. అయితే కొరటాల శివ అదే కథతో సినిమా చేస్తుండడం నాకు షాక్ ఇచ్చింది. ఆ కథ తనదే అని ఈ విషయంపై అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కొరటాలకు కథ పంపానని ఆయన ఆచార్య కథ వేరని చెప్పారని అన్నారు. మొత్తానికి ఈ ట్విస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…