Sri Reddy : మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున విరుచుకు పడే శ్రీరెడ్డి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. మధ్య మధ్యలో తనంటే గిట్టని వాళ్లకు కౌంటర్లు కూడా వేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న శ్రీరెడ్డి ప్రస్తుతం యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు వంటల వీడియోలతో అలరిస్తోంది. ఈ మధ్యే మటన్, చేపలు, పీతల కూరలతో అదరగొట్టింది. ఇక తాజాగా ఈమె కోడికూర వండింది. అయితే అది సాదా సీదా కోడి కాదు.. కడక్ నాథ్ కోడి. అదేనండీ.. శరీరం మొత్తం ఈకలతో సహా నల్లగా ఉంటుంది కదా.. అదే కోడి. ఆ కోడి కూరనే శ్రీరెడ్డి తాజాగా వండింది.
కడక్నాథ్ కోళ్లకు దేశంలో ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ కోళ్లు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. సాధారణ కోళ్లతో పోలిస్తే వీటిని కొద్దిగా ఎక్కువ రోజుల పాటు పెంచాలి. ఇక ఈ కోళ్లలో కొవ్వు చాలా తక్కువగా.. పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకనే ఈ కోళ్లకు ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. వీటి గుడ్లు కూడా ఎక్కువ ధరనే కలిగి ఉంటాయి. అయితే శ్రీరెడ్డి తాజాగా కడక్నాథ్ కోళ్లను వండింది. ఈమె చేసిన కోడికూర చూస్తుంటే నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఈ కోళ్లను ఎలా వండాలో కూడా శ్రీరెడ్డి తెలియజేసింది.
కడక్నాథ్ కోళ్ల సహజంగానే సాధారణ కోళ్ల కన్నా రుచిగా ఉంటాయి. కనుక వాటిని సరైన పదార్థాలతో వండితే కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకు గాను ఈ కోడికూరను కొబ్బరిపాలతో వండాలని శ్రీరెడ్డి చెప్పింది. అప్పుడు రుచి ఇంకా పెరుగుతుందని తెలియజేసింది. ఇలా ఈ కోడితో కూర వండి పురుషులు తింటే వారిలో కరెంట్ పెరుగుతుందని చెప్పింది. ఇది వారికి ఔషధంలా పనిచేస్తుందని తెలియజేసింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి వండిన కడక్నాథ్ కోడి కూర వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందరూ ఆ కోడికూరను తినాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…