Puneeth Rajkumar : కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. పునీత్ హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. అభిమానులు సొంతింటి మనిషిని కోల్పోయినట్టు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్రముఖులు సైతం పునీత్ లేరని తెలిసి బాధపడుతున్నారు. పునీత్ ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు కదిలారు.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్, రానా.. పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, అలీ బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్నారు. పునీత్ పార్ధీవదేహాన్ని సందర్శించిన చిరంజీవి, వెంకటేష్, అలీ, శ్రీకాంత్ నివాళులర్పించారు. పునీత్ అన్న శివ రాజ్ కుమార్ ను ఓదార్చారు చిరు.
పునీత్ మరణం తర్వాత ఆయన జ్ఞాపకాలని నెమరవేసుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువరత్న సినిమా ప్రమోషన్లో భాగంగా కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ పునీత్ అంటే తమకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వెనక నుండి వచ్చిన పునీత్ వారికి సర్ప్రైజ్ ఇచ్చి సంతోష పెట్టారు. ఆ క్లిప్స్ చూస్తే ఫ్యాన్స్కి, పునీత్ మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్ధమవుతోంది. ఈ క్లిప్స్ చూసి అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…