Radhe Shyam : చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబల్స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమకథ గా మెషన్ పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఇందులో రెబల్స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.
వింటేజ్ బ్యాక్డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా ఎప్పుడో రావలసి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమా కోసం దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టగా, యూవీ సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర వడ్డీలనే చెల్లించినట్లు తెలుస్తోంది.
కరోనా వల్ల రెండేళ్ల పాటు చిత్రీకరణ జరగడంతో వడ్డీల భారం పెరిగింది. మరి రాధే శ్యామ్ విడుదల అయ్యాక ఆ రేంజ్లో లాభాలు రాబడతాడా అన్నది చూడాలి. 1960ల సమయంలో ఐరోపాలో జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొంత భాగాన్ని ఐరోపాలో షూట్ చేసినప్పటికీ, హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లలో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది.
రాధే శ్యామ్’ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…