Radhe Shyam : చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబల్స్టార్ ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమకథ గా మెషన్ పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఇందులో రెబల్స్టార్ ప్రభాస్ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.
వింటేజ్ బ్యాక్డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెరకెక్కించారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా ఎప్పుడో రావలసి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే సినిమా కోసం దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టగా, యూవీ సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర వడ్డీలనే చెల్లించినట్లు తెలుస్తోంది.
కరోనా వల్ల రెండేళ్ల పాటు చిత్రీకరణ జరగడంతో వడ్డీల భారం పెరిగింది. మరి రాధే శ్యామ్ విడుదల అయ్యాక ఆ రేంజ్లో లాభాలు రాబడతాడా అన్నది చూడాలి. 1960ల సమయంలో ఐరోపాలో జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొంత భాగాన్ని ఐరోపాలో షూట్ చేసినప్పటికీ, హైదరాబాద్లో నిర్మించిన భారీ సెట్లలో ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది.
రాధే శ్యామ్’ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…