Puneeth Rajkumar : కన్నడ నాట ప్రజలు శోకసంద్రంలో నిండిపోయారు. తాము ఎంతగానో అభిమానించే నటుడు పునీత్ రాజ్కుమార్ గుండె పోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ వద్దకు పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోగా.. ఇక ఆయన లేరు ఆయన విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్ రాజ్ కుమార్ను బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో ఆయనకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నామని, ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంతలోనే ఆయన మరణవార్త అందరినీ కలచివేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. హీరో నితిన్, సోనూసూద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతోపాటు తారాలోకం అంతా పునీత్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురైంది. అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పునీత్ సడెన్గా మృతి చెందడం తనను షాక్కు గురి చేసిందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి.. అని నితిన్ ట్వీట్ చేశారు.
నా గుండె పగిలింది, నిన్ను మిస్ అవుతున్నాను బ్రదర్.. అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. పునీత్ మరణం షాక్కు గురి చేసిందని, ఇంత సడెన్ గా ఆయన చనిపోవడం బాధగా ఉందని, మరణం అనేది ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగైనా రావచ్చని.. ఉన్నంత కాలం హ్యాపీగా జీవించాలని.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కాసేపట్లో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం తరలిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…