Puneeth Rajkumar : కన్నడ నాట ప్రజలు శోకసంద్రంలో నిండిపోయారు. తాము ఎంతగానో అభిమానించే నటుడు పునీత్ రాజ్కుమార్ గుండె పోటుతో హఠాన్మరణం చెందడాన్ని అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ వద్దకు పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోగా.. ఇక ఆయన లేరు ఆయన విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్ రాజ్ కుమార్ను బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో ఆయనకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నామని, ఆయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంతలోనే ఆయన మరణవార్త అందరినీ కలచివేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. హీరో నితిన్, సోనూసూద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతోపాటు తారాలోకం అంతా పునీత్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురైంది. అందరూ ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పునీత్ సడెన్గా మృతి చెందడం తనను షాక్కు గురి చేసిందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి.. అని నితిన్ ట్వీట్ చేశారు.
నా గుండె పగిలింది, నిన్ను మిస్ అవుతున్నాను బ్రదర్.. అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. పునీత్ మరణం షాక్కు గురి చేసిందని, ఇంత సడెన్ గా ఆయన చనిపోవడం బాధగా ఉందని, మరణం అనేది ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగైనా రావచ్చని.. ఉన్నంత కాలం హ్యాపీగా జీవించాలని.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
కాసేపట్లో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడియానికి అభిమానుల సందర్శనార్థం తరలిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…