Chiranjeevi : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ చిత్రాల హవా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్, మెగాస్టార్ నటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మరొక మల్టీస్టారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉండగా చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక బాబీ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా మెగాస్టార్ కి శ్రీకాంత్ అడ్డాల కథను వినిపించగా అందుకు మెగాస్టార్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్క్రిప్టు మొత్తం సిద్ధం చేయాల్సిందిగా మెగాస్టార్ సూచించినట్లు తెలుస్తోంది.
ఇక శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ కథలో మరో కీలక పాత్ర ఉందని అందులో నటించడానికి అల్లు అర్జున్ కరెక్ట్ గా సరిపోతారని శ్రీకాంత్ అడ్డాల సూచించినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఇదివరకే మెగాస్టార్ అల్లు అర్జున్ కలిసి డాడీ, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో కనిపించారు. మరి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…