Nagababu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై యుద్ధం ఇంకా ముగియలేదు. ఏపీ మంత్రులు వర్సెస్ పవన్ అన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు మరో మారు మారిపోయాయి. ఈ క్రమంలోనే నాగబాబు వరుస వీడియోలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ను తొక్కేయడానికే ఆయన సినిమా భీమ్లా నాయక్ను అడ్డుకుంటున్నారని.. ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక మళ్లీ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందని.. ఇది సరికాదని.. త్వరగా సమస్యను పరిష్కరించాలని.. కొత్త జీవోను త్వరగా విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ చానల్లో మళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ మధ్య కాలంలో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఏపీలో థియేటర్లలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి చేశారు. థియేటర్లలో ఉన్న నిబంధనలను ఎత్తేశారు. కానీ టిక్కెట్ల ధరల విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య చిరంజీవి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో వెళ్లి సీఎం జగన్ను కలిశాక ఒక వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకనే నాగబాబు స్పందించారు.
టిక్కెట్ల ధరల విషయంలో ఇంకా కొత్త జీవోను ఎందుకు విడుదల చేయలేదని నాగబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విడుదల చేస్తే జీవోను విడుదల చేయండి.. లేదంటే ఏపీలో తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి.. అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులకు సినిమా అంటే ఏమిటో తెలియదని.. సినిమాటోగ్రఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి సినిమాను తీయాలని అన్నారు. తెలుగు సినిమాలు ఇప్పటికే చాలా వరకు నష్టపోయానని.. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…