Nagababu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై యుద్ధం ఇంకా ముగియలేదు. ఏపీ మంత్రులు వర్సెస్ పవన్ అన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు మరో మారు మారిపోయాయి. ఈ క్రమంలోనే నాగబాబు వరుస వీడియోలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ను తొక్కేయడానికే ఆయన సినిమా భీమ్లా నాయక్ను అడ్డుకుంటున్నారని.. ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక మళ్లీ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందని.. ఇది సరికాదని.. త్వరగా సమస్యను పరిష్కరించాలని.. కొత్త జీవోను త్వరగా విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ చానల్లో మళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ మధ్య కాలంలో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఏపీలో థియేటర్లలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి చేశారు. థియేటర్లలో ఉన్న నిబంధనలను ఎత్తేశారు. కానీ టిక్కెట్ల ధరల విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య చిరంజీవి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో వెళ్లి సీఎం జగన్ను కలిశాక ఒక వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకనే నాగబాబు స్పందించారు.
టిక్కెట్ల ధరల విషయంలో ఇంకా కొత్త జీవోను ఎందుకు విడుదల చేయలేదని నాగబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విడుదల చేస్తే జీవోను విడుదల చేయండి.. లేదంటే ఏపీలో తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి.. అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులకు సినిమా అంటే ఏమిటో తెలియదని.. సినిమాటోగ్రఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి సినిమాను తీయాలని అన్నారు. తెలుగు సినిమాలు ఇప్పటికే చాలా వరకు నష్టపోయానని.. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…