Nagababu : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై యుద్ధం ఇంకా ముగియలేదు. ఏపీ మంత్రులు వర్సెస్ పవన్ అన్నట్లు ప్రస్తుతం పరిస్థితులు మరో మారు మారిపోయాయి. ఈ క్రమంలోనే నాగబాబు వరుస వీడియోలను రిలీజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ను తొక్కేయడానికే ఆయన సినిమా భీమ్లా నాయక్ను అడ్డుకుంటున్నారని.. ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక మళ్లీ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తుందని.. ఇది సరికాదని.. త్వరగా సమస్యను పరిష్కరించాలని.. కొత్త జీవోను త్వరగా విడుదల చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తన యూట్యూబ్ చానల్లో మళ్లీ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ మధ్య కాలంలో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఏపీలో థియేటర్లలో 50 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 100 శాతానికి చేశారు. థియేటర్లలో ఉన్న నిబంధనలను ఎత్తేశారు. కానీ టిక్కెట్ల ధరల విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య చిరంజీవి పలువురు హీరోలు, దర్శక నిర్మాతలతో వెళ్లి సీఎం జగన్ను కలిశాక ఒక వారం, పది రోజుల్లో కొత్త జీవో వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కష్టాలు ఎదురవుతున్నాయి. అందుకనే నాగబాబు స్పందించారు.
టిక్కెట్ల ధరల విషయంలో ఇంకా కొత్త జీవోను ఎందుకు విడుదల చేయలేదని నాగబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే విడుదల చేస్తే జీవోను విడుదల చేయండి.. లేదంటే ఏపీలో తెలుగు సినిమాలను బ్యాన్ చేయండి.. అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రులకు సినిమా అంటే ఏమిటో తెలియదని.. సినిమాటోగ్రఫీ మంత్రి నానిని హీరోగా పెట్టి సినిమాను తీయాలని అన్నారు. తెలుగు సినిమాలు ఇప్పటికే చాలా వరకు నష్టపోయానని.. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని అన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…