Naga Chaithanya : సమంత, నాగచైతన్య విడిపోతారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను వారు నిజం చేశారు. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో విడాకుల అనంతరం ఇద్దరూ తీవ్రమైన బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఓ వైపు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన పోస్టులను పెడుతుంటే.. మరోవైపు నాగచైతన్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ముభావంగా కనిపిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరూ విడిపోకముందు నెల రోజుల ముందు నుంచే విడిగా ఉంటున్నారు. అప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. కానీ విడాకులు తీసుకున్నాక ఆ అనుమానమే నిజం అయింది. ఇక వివాహం అయ్యాక ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అది సమంతదే. దీంతో చైతూ జూబ్లీహిల్స్లో భారీ ఖర్చుతో ఓ బంగ్లా కొన్నారు. దాని రెనొవేషన్ వర్క్ కూడా ఇంకా జరుగుతోంది. అది పూర్తయ్యేందుకు ఏడాది పడుతుందని తెలుస్తోంది.
ఆ ఇంటి పని పూర్తయ్యాక చైతూ సమంతతో కలిసి అందులోకి మారుదామని అనుకున్నాడు. అప్పటి వరకు సమంతతో ఆమె అపార్ట్మెంట్లో ఉండవచ్చని వారిద్దరూ కలసి ఉంటున్నారు. అయితే విడిపోవడానికి నెల రోజుల ముందు నుంచి సమంత ఆ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుండగా.. చైతూ మాత్రం ఓ విలాసవంతమైన హోటల్లో ఉంటున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే కొత్త బంగ్లా సిద్ధం కాకుండానే వీరిద్దరూ విడిపోయారు. అయినప్పటికీ చైతూ ఆ బంగ్లా కొన్నాడు కనుక అందులో ఒంటరిగానే ఉండేందుకు సిద్ధమయ్యాడని టాక్. కానీ అది పూర్తయ్యేందుకు ఇంకా సంవత్సరం అయినా పడుతుంది కదా.. అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద ఉండడం ఇష్టం లేని చైతూ నగరంలోనే ఓ పోష్ ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లా సిద్ధం అయ్యే వరకు చైతూ ఆ అపార్ట్మెంట్లో ఉండనున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ బ్యూటిఫుల్ కపుల్ విడిపోవడం మాత్రం ఇప్పటికీ ఇంకా చాలా మంది అక్కినేని ఫ్యాన్స్కు నచ్చడం లేదు..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…