Naga Chaithanya : సమంత, నాగచైతన్య విడిపోతారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలను వారు నిజం చేశారు. తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో విడాకుల అనంతరం ఇద్దరూ తీవ్రమైన బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఓ వైపు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన పోస్టులను పెడుతుంటే.. మరోవైపు నాగచైతన్య వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. ముభావంగా కనిపిస్తున్నారు.
అయితే ఈ ఇద్దరూ విడిపోకముందు నెల రోజుల ముందు నుంచే విడిగా ఉంటున్నారు. అప్పుడే అందరికీ డౌట్ వచ్చింది. కానీ విడాకులు తీసుకున్నాక ఆ అనుమానమే నిజం అయింది. ఇక వివాహం అయ్యాక ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అది సమంతదే. దీంతో చైతూ జూబ్లీహిల్స్లో భారీ ఖర్చుతో ఓ బంగ్లా కొన్నారు. దాని రెనొవేషన్ వర్క్ కూడా ఇంకా జరుగుతోంది. అది పూర్తయ్యేందుకు ఏడాది పడుతుందని తెలుస్తోంది.
ఆ ఇంటి పని పూర్తయ్యాక చైతూ సమంతతో కలిసి అందులోకి మారుదామని అనుకున్నాడు. అప్పటి వరకు సమంతతో ఆమె అపార్ట్మెంట్లో ఉండవచ్చని వారిద్దరూ కలసి ఉంటున్నారు. అయితే విడిపోవడానికి నెల రోజుల ముందు నుంచి సమంత ఆ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుండగా.. చైతూ మాత్రం ఓ విలాసవంతమైన హోటల్లో ఉంటున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే కొత్త బంగ్లా సిద్ధం కాకుండానే వీరిద్దరూ విడిపోయారు. అయినప్పటికీ చైతూ ఆ బంగ్లా కొన్నాడు కనుక అందులో ఒంటరిగానే ఉండేందుకు సిద్ధమయ్యాడని టాక్. కానీ అది పూర్తయ్యేందుకు ఇంకా సంవత్సరం అయినా పడుతుంది కదా.. అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద ఉండడం ఇష్టం లేని చైతూ నగరంలోనే ఓ పోష్ ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగ్లా సిద్ధం అయ్యే వరకు చైతూ ఆ అపార్ట్మెంట్లో ఉండనున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఈ బ్యూటిఫుల్ కపుల్ విడిపోవడం మాత్రం ఇప్పటికీ ఇంకా చాలా మంది అక్కినేని ఫ్యాన్స్కు నచ్చడం లేదు..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…