Chiranjeevi : గత కొద్ది రోజులుగా తారా స్థాయిలో జరిగిన మా ఎన్నికల ప్రచారానికి తెర పడి ఆదివారం ఎన్నికలు కూడా జరిగాయి. సాయంత్రం ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, తాత్కాలికమైన, చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదని అన్నారు. అందరూ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్తో కలిసి మంచు ప్యానెల్పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానెల్లో కేవలం నాగబాబు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కు దూరమైందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదల అయిన ఫలితాలను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వచ్చింది కనుక ఇవి ఏకపక్ష ఎన్నికలేనని భావించవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…