Chiranjeevi : గత కొద్ది రోజులుగా తారా స్థాయిలో జరిగిన మా ఎన్నికల ప్రచారానికి తెర పడి ఆదివారం ఎన్నికలు కూడా జరిగాయి. సాయంత్రం ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, తాత్కాలికమైన, చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదని అన్నారు. అందరూ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్తో కలిసి మంచు ప్యానెల్పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానెల్లో కేవలం నాగబాబు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కు దూరమైందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదల అయిన ఫలితాలను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వచ్చింది కనుక ఇవి ఏకపక్ష ఎన్నికలేనని భావించవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…