Chiranjeevi : గత కొద్ది రోజులుగా తారా స్థాయిలో జరిగిన మా ఎన్నికల ప్రచారానికి తెర పడి ఆదివారం ఎన్నికలు కూడా జరిగాయి. సాయంత్రం ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. పదవులు శాశ్వతం కాదని, తాత్కాలికమైన, చిన్న చిన్న పదవుల కోసం ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం సరికాదని అన్నారు. అందరూ ఇండస్ట్రీ అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఇంత చిన్న ఎన్నికలకు ఇంత హైప్ అవసరం లేదన్నారు. ఇందుకు గాను మనలో మనం గొడవపడడం బాగాలేదన్నారు. అందరూ కలసి కట్టుగా ఉండాలన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుంచి మా ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్తో కలిసి మంచు ప్యానెల్పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానెల్లో కేవలం నాగబాబు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కు దూరమైందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదల అయిన ఫలితాలను చూస్తే మంచు విష్ణుకు భారీ మెజారిటీ వచ్చింది కనుక ఇవి ఏకపక్ష ఎన్నికలేనని భావించవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…