MP Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి చెందినదిగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న ఓ వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా అంతటా ఈ విషయం తీవ్ర చర్చనీయాశం అవుతోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే మాధవ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది. అయితే ఈ విషయంలో టీడీపీ మాత్రం తగ్గడం లేదు. టీవీల్లో చర్చలు, ఇంటర్వ్యూలు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఇంకో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది.
సదరు ఎంపీదిగా చెప్పబడుతున్న ఆ వీడియోని అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షకు పంపగా అది అసలైన వీడియోనే అని.. అందులో ఉన్నది గోరంట్ల మాధవే అని రిపోర్ట్ లో తేల్చారు. ఈ మేరకు టీడీపీ ఈ పరీక్షలు చేయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పట్టాభి మీడియా ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తాము ఆ వీడియోని అమెరికాలోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ఎక్లిప్స్ ల్యాబ్ కి పంపామని చెప్పారు.
అయితే ఆ వీడియోలో ఎటువంటి గ్రాఫిక్స్ లేవని, మార్ఫింగ్ కూడా జరగలేదని ఫోరెన్సిక్ పరీక్షల్లో ఋజువైందని పట్టాభి తెలియజేశారు. ఈ మేరకు రిపోర్టులను అందజేశారని తెలిపారు. ఇక ఆ ల్యాబ్ అధ్యక్షుడు జిమ్ స్టాఫ్పోర్డ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని అన్నారు. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తున్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…