MP Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి చెందినదిగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న ఓ వీడియో వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా అంతటా ఈ విషయం తీవ్ర చర్చనీయాశం అవుతోంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే మాధవ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసింది. అయితే ఈ విషయంలో టీడీపీ మాత్రం తగ్గడం లేదు. టీవీల్లో చర్చలు, ఇంటర్వ్యూలు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఇంకో అడుగు ముందుకేసినట్లు కనిపిస్తోంది.
సదరు ఎంపీదిగా చెప్పబడుతున్న ఆ వీడియోని అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షకు పంపగా అది అసలైన వీడియోనే అని.. అందులో ఉన్నది గోరంట్ల మాధవే అని రిపోర్ట్ లో తేల్చారు. ఈ మేరకు టీడీపీ ఈ పరీక్షలు చేయించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి పట్టాభి మీడియా ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తాము ఆ వీడియోని అమెరికాలోని ప్రఖ్యాత ఫోరెన్సిక్ ల్యాబ్ అయిన ఎక్లిప్స్ ల్యాబ్ కి పంపామని చెప్పారు.
అయితే ఆ వీడియోలో ఎటువంటి గ్రాఫిక్స్ లేవని, మార్ఫింగ్ కూడా జరగలేదని ఫోరెన్సిక్ పరీక్షల్లో ఋజువైందని పట్టాభి తెలియజేశారు. ఈ మేరకు రిపోర్టులను అందజేశారని తెలిపారు. ఇక ఆ ల్యాబ్ అధ్యక్షుడు జిమ్ స్టాఫ్పోర్డ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని అన్నారు. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తున్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…