Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు నటన మీద మక్కువతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాము అనుకున్నది సాధించి చివరకు ఇండస్ట్రీలో అగ్రహీరోలలాగా, సినీ పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీ మొదట్లో ఈ గొప్ప నటులు చేసిన కృషి ఎంతోమందికి దారి చూపింది. ఇదే కోవకు చెందినవారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు.
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర స్థాయి హీరోగా పేరు పొందారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవిని మనం ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటాం. ఎప్పుడైనా మెగాస్టార్ అన్న బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలోనే చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత అయిన కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించారు.
అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ అందుకున్నారు. ఆ టైం లో కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరణ మృదంగం చిత్రంలో మొదటి సారిగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పెట్టారు. ఆ తరవాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
మరలా తిరిగి ఇదే బ్యానర్ పై దాదాపు 20 సంవత్సరాల తర్వాత భోలా శంకర్ చిత్రంతో రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో అజిత్ హీరోగా నటించి విజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ భోలా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రఘు బాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…