Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు నటన మీద మక్కువతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాము అనుకున్నది సాధించి చివరకు ఇండస్ట్రీలో అగ్రహీరోలలాగా, సినీ పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీ మొదట్లో ఈ గొప్ప నటులు చేసిన కృషి ఎంతోమందికి దారి చూపింది. ఇదే కోవకు చెందినవారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు.
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర స్థాయి హీరోగా పేరు పొందారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవిని మనం ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటాం. ఎప్పుడైనా మెగాస్టార్ అన్న బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలోనే చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత అయిన కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించారు.
అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ అందుకున్నారు. ఆ టైం లో కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరణ మృదంగం చిత్రంలో మొదటి సారిగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పెట్టారు. ఆ తరవాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
మరలా తిరిగి ఇదే బ్యానర్ పై దాదాపు 20 సంవత్సరాల తర్వాత భోలా శంకర్ చిత్రంతో రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో అజిత్ హీరోగా నటించి విజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ భోలా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రఘు బాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…