Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో పైకి వచ్చిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వంటి వారు నటన మీద మక్కువతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని తాము అనుకున్నది సాధించి చివరకు ఇండస్ట్రీలో అగ్రహీరోలలాగా, సినీ పరిశ్రమకు మూల స్తంభాలుగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీ మొదట్లో ఈ గొప్ప నటులు చేసిన కృషి ఎంతోమందికి దారి చూపింది. ఇదే కోవకు చెందినవారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎన్నో కష్టాలను ఎదుర్కొని మెగాస్టార్ గా ఎదిగారు.
1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర స్థాయి హీరోగా పేరు పొందారు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవిని మనం ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటాం. ఎప్పుడైనా మెగాస్టార్ అన్న బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో తెలుసుకున్నారా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలోనే చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ అధినేత అయిన కేఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి ఎన్నో చిత్రాల్లో నటించి విజయం సాధించారు.
అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి ఎన్నో చిత్రాలలో నటించి హిట్స్ అందుకున్నారు. ఆ టైం లో కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మరణ మృదంగం చిత్రంలో మొదటి సారిగా చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ అని పెట్టారు. ఆ తరవాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.
మరలా తిరిగి ఇదే బ్యానర్ పై దాదాపు 20 సంవత్సరాల తర్వాత భోలా శంకర్ చిత్రంతో రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో అజిత్ హీరోగా నటించి విజయం సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ భోలా శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రఘు బాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, ప్రగతి, తులసి, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి వారు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…