Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది వర్ధమాన నటులకు అవకాశం దక్కింది. జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. దేశ విదేశాల్లో కూడా జబర్దస్త్ షో కమెడియన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారు చేసే స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది. సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. కొంతకాలంగా హైపర్ ఆది టీం లీడర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మల్లెమాల వారు నిర్వహించే జబర్దస్త్ షోతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హైపర్ ఆది తన స్కిట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇప్పుడు హైపర్ ఆది మీద ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి డ్రామా కంపెనీ షోలలో పాల్గొని మల్లెమాల సంస్థ నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆది జబర్దస్త్ లోకి రాకముందు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడట. ఆది బీటెక్ చదువుకునే టైంలో రూ.20 లక్షల వరకు అప్పు చేశాడని ఒక ఇంటర్వ్యూ ద్వారా గుర్తు చేసుకున్నాడు.
అప్పులు తీర్చడానికి నాన్న మూడు ఎకరాల పొలం అమ్మేశాడు అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా రెండు చేతులతో లక్షల రూపాయలను సంపాదిస్తూ కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆది తన సొంత ఊరిలో 16 ఎకరాల పొలం, హైదరాబాద్ లో ఒక మంచి ఇల్లు కొన్నాడని వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. దీంతో ఆది రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సుడిగాలి సుధీర్, ఆది వంటి వారు అందరూ నెల నెలా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదికి ఆది సుమారుగా రూ.1 కోటికి పైగానే సంపాదిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…