DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని.. అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మూవీ లవర్స్ ఈ సినిమాను.. అందులోని మాటలను, పాటలను మర్చిపోలేకపోతున్నారు.
ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా డీజే టిల్లు-2పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అనుమప పరమేశ్వరన్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆడియన్స్ను అలరించింది ఈ మలయాళ బ్యూటీ. తాజాగా కార్తికేయ 2 మూవీలో నిఖిల్ సిద్దార్థ్ సరసన హీరోయిన్గా నటించింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుపమ కెరీర్ లో మరో హిట్ బొమ్మ ఈ అమ్మడి ఖాతాలో చేరినట్లైంది. అలాగే ప్రస్తుతం నిఖిల్తోనే కలిసి 18 పేజెస్ మూవీ చేస్తోంది అనుపమ. దీనికి సూర్య ప్రతాప్ డైరెక్టర్ కాగా బన్నీ వాస్ ప్రొడ్యూసర్. ఈ క్రమంలోనే అనుపమకు ఈ ఏడాది లక్ కలసి వచ్చినట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…