Pop Corn : ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ లకి వెళ్లి సినిమాలు చూడడం అనేది ఎంత ఖర్చుతో కూడుకున్న విషయమో మనందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి మాల్ కి వెళ్లి హాయిగా పాప్ కార్న్ తింటూ సినిమా చూసి బయటికి వచ్చాక కానీ అసలు విషయం తెలియదు. తను చూసిన సినిమా టికెట్ తో పోల్చినపుడు పాప్ కార్న్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడో చాలా మందికి ఇప్పుడే అర్థమవుతోంది. టికెట్ రేట్ కి 2 లేదా 3 రెట్లు అధికంగా పాప్ కార్న్ తినడానికే ఖర్చు చేస్తున్నారు.
ఇక ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళితే మాత్రం ఖర్చులు తడిసి మోపెడవడం ఖాయం. నలుగురు సభ్యులు ఉన్న కుంటుంబం అయితే సినిమా టికెట్లకి రూ.1000, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ కొంటే రూ.1000, వీటికి కార్ లేదా బైక్ పెట్రోల్ ఖర్చులు అదనం. మొత్తం మీద ఒక ఫ్యామిలీ సినిమా చూడటానికి అయ్యే ఖర్చు రూ.2000 నుండి రూ.3000 వరకు ఉంటోంది. మామూలు మధ్య తరగతి ప్రజలకి మల్టీప్లెక్స్ లకి వెళ్లి సినిమాలు చూడడం అనేది భారంగా మారిందని చెప్పవచ్చు.
ఇక సినిమా టికెట్ రేట్ల విషయం పక్కన పెడితే.. అసలు మనకి బయట రూ.10 నుండి రూ.20 కి దొరికే పాప్ కార్న్ మల్టీప్లెక్స్ లలో మాత్రం రూ.200 నుండి రూ.500 వరకు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ?
అయితే దీనంతటి వెనక ఎన్నో లెక్కలు ఉంటాయని అంటున్నారు అజయ్ బిజ్లి. మన దేశంలోని పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్ కి ఈయనే ఓనర్. ఇక ఈయన ఒక ఇంటర్య్వూ లో మాట్లాడుతూ.. ఇండియా అంతా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ల నుండి మల్టీప్లెక్స్ స్క్రీన్లకి మారుతుందని, ప్రేక్షకులు కూడా నెమ్మదిగా ఈ కల్చర్ కి అలవాటు పడుతున్నారని అన్నారు. పెద్ద తెరలపై సినిమా చూడాలంటే ఈ ధరని భరించక తప్పదని చెప్పారు.
ఇక పాప్ కార్న్ ధర విషయానికి వస్తే.. అది పూర్తిగా ప్రేక్షకులకు మాల్స్ అనుభూతిని ఇవ్వడం, రవాణా ఖర్చులు, థియేటర్లలో ఎయిర్ కండిషనింగ్, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, మాల్ స్థలానికి అద్దెలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ధరని పాప్ కార్న్ అసలు విలువతో పోల్చడం సరికాదని అన్నారు. ప్రేక్షకులకి బిగ్ స్క్రీన్ పై తాము అందించే అనుభూతిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. కాగా త్వరలో మల్టీప్లెక్స్ రంగంలో అగ్రగామి కంపైనీలైన పీవీఆర్ ఇంకా ఐనాక్స్ లు రెండూ విలీనం కాబోతున్నాయని తెలుస్తోంది. అయితే పాప్ కార్న్ ధరలు అంత ఎందుకు ఎక్కువ ఉంటాయో చెప్పేసరికి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…