Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక చిత్రాల్లో ఆయన విలన్గా, హీరోగా మెప్పించారు. నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణించారు. మొత్తం 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా తన జీవితానికి చెందిన పలు విశేషాలను పంచుకున్నారు.
ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ పేరిట ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి మోహన్ బాబు హాజరై ఆలీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు అనుభవాలను ఆయన ఆలీతో పంచుకున్నారు. తాను సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు ఒక స్కూల్లో నెలకు కేవలం రూ.140 జీతం మాత్రమే తీసుకుని పనిచేశానని మోహన్ బాబు చెప్పారు.
ఆ స్కూల్లో ఏడాది కాలం పాటు డ్రిల్ మాస్టర్గా పనిచేశానని, అయితే ఆ సమయంలో తనను కులం పేరిట ఎంతో అవమానించారని అన్నారు. స్కూల్ నిర్వాహకులకు చెందిన కులం వాడ్ని కాకపోవడంతో తనను అవమానించేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు ఎంతో బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కులం ఎవరికీ చదువుకు అడ్డం కాకూడదనే ఉద్దేశంతోనే తాను విద్యాసంస్థలను ప్రారంభించానని తెలిపారు.
ఈ క్రమంలోనే విద్యా నికేతన్ పాఠశాలను ప్రారంభించానని, తమ స్కూల్లో కులం అనే కాలమ్ను తొలగించానని తెలిపారు. మొట్ట మొదటిసారిగా కులం అనే కాలమ్ను తొలగించిన వ్యక్తిని తానేనని అన్నారు. ఇలా అప్పట్లో కులం పేరిట తాను ఎన్నో అవమానాల పాలయ్యానని తెలిపారు.
అయితే సినిమాల్లో ఈ స్టైల్ ఎలా వచ్చిందని అడగ్గా.. తాను పట్టుబట్టి నేర్చుకున్నానని మోహన్ బాబు తెలియజేశారు. అందుకనే ప్రేక్షకులు తనను ఆదరించారని అన్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…