Posani : సాయిధరమ్ తేజ్కు చెందిన రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేయడం ఏమోగానీ ఆ వివాదం పెను దుమారంగా మారుతోంది. దీనిపై పోసాని కృష్ణమురళి ఇప్పటికే ఘాటుగా స్పందించారు. పవన్ను ఆయన విమర్శించారు. అయితే ఇది జీర్ణించుకోలేని పవన్ ఫ్యాన్స్ పోసానికి గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్ చేశారు. మెసేజ్లు పెట్టారు. కాగా దీనిపై పోసాని తాజాగా మీడియాతో మాట్లాడారు.
పవన్కల్యాణ్పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్లు వచ్చాయని పోసాని కృష్ణమురళి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ కక్ష కట్టి మాట్లాడటం సరికాదని, పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తనపై పవన్ కల్యాణ్కు పీకల దాకా కోపం ఉందని పోసాని అన్నారు. అయినప్పటికీ పవన్పై తనకు కోపం లేదన్నారు. తాను జగన్ అభిమానిని అని, తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు. పవన్ అభిమానుల్లా తాను అసభ్య పదజాలంతో మాట్లాడనని అన్నారు. పవన్ను ప్రశ్నించినందుకు తనకు రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చాయన్నారు.
ఇంత మాట్లాడినా పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ గురించి ఎందుకు పెదవి విప్పలేదని పోసాని అన్నారు. చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. పవన్ ఫ్యాన్స్ సైకోలని, వాళ్లకు ఏం చెప్పుకుంటావో చెప్పుకో.. అని పోసాని అన్నారు. రాజకీయాల్లో తన గురించి మాట్లాడాలని, తన కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దని అన్నారు. చిరంజీవి గారు, మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.. అని పోసాని పేర్కొన్నారు.
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…