Keerthy Suresh : తెలుగులో మహానటి చిత్రం ద్వారా కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. దీంతో ఆమెకు పలు వరుస సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే మహానటి తరువాత అంతగా చెప్పుకునే హిట్లేవీ ఈమెకు రాలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం పుష్కలంగానే వస్తున్నాయి.
ఇక కీర్తి సురేష్ తాజాగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన చానల్ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అందులో వచ్చే వీడియోలను వీక్షించాలని.. కీర్తి సురేష్ కోరింది.
కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈ మూవీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి షూటింగ్ చాంపియన్గా ఎలా మారింది ? అన్న కథను చూపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆకట్టుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…