Ram Charan Upasana : నటుడు రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె పెట్టే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. ఉపాసన ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇందుకు గాను ఆమె నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మాత్రం కొందరి ఆగ్రహానికి కారణమవుతోంది. ఆమె పోస్టు వివాదాల్లో నిలిచింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన ఓ ఆలయం ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ ఆలయ గోపురంలో సూక్ష్మ రూపంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వారి మధ్యలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని.. తాము ఆ ఫొటోలో ఎక్కడ ఉన్నామో కనుక్కోండి.. అంటూ ఉపాసన ఓ ఫొటోను షేర్ చేశారు.
వాస్తవానికి ఫొటో ఆలయ శిఖరందే అయినప్పటికీ దాన్ని ఎడిట్ చేశారు. ఆ శిఖరంపై ప్రజలు సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా ఫొటోను ఎడిట్ చేశారు. దీంతో ఆ ఫొటోను ఎడిట్ చేసింది ఎవరో చెప్పాలని ఉపాసన కోరారు.
అయితే ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటో వివాదానికి కారణమైంది. ఆలయ శిఖరం ఎంతో పవిత్రమైందని, దానిపై మనుషులు ఉండేలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ నిజంగా ఎవరో తెలిస్తే చెప్పండి.. అసలైన సన్మానం చేస్తాం.. అని నెటిజన్లు అంటున్నారు. ఈ విధమైన ఫొటోను షేర్ చేసిన ఉపాసనపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులను అవమానించేలా వ్యవహరించారని.. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని, ఆ ఫొటోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉపాసన స్పందించాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…