Kasthuri Shankar : ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. నయన్ అండ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళై 4 నెలలు కూడా గడవకముందే కవల అబ్బాయిలకు నయన్ విగ్నేష్ తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం.. అంటే మరో మహిళ గర్భంతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. చాలామంది సెలెబ్రిటీలు ఇదే విధానంలో తల్లిదండ్రులు అవుతున్నారు.
ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం.
ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం అంటూ ట్వీట్ చేసింది. కస్తూరి ఈ ట్వీట్ నయనతారని ఉద్దేశించే చేసింది అంటూ కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నారు అంటూ ఆమెకు సపోర్ట్ చేశారు. నన్ను విమర్శించే వాళ్లకు ముందే తెలిసి ఉండాలి. నేను అన్ని వివరాలు తెలుసుకునే ఈ కామెంట్స్ చేశాను. నా లెక్కలు నాకు ఉన్నాయి. నిస్వార్థంగా నా గళం వినిపిస్తున్నాను అంటూ కస్తూరి మరో ట్వీట్ చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…