Jagadeka Veerudu Athiloka Sundari : 1990లో ఇంద్రలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు కూతురు ఇంద్రజ భూమికి దిగి వచ్చి ఒక మానవుని ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. అని ఒక కొత్త కథాంశంతో వచ్చిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అతిలోక సుందరిగా శ్రీదేవి నటించింది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సి.అశ్వినీదత్ నిర్మాణ సారథ్యం వహించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటి తరానికి కూడా ఎంతో నచ్చుతుంది. అంత అద్భుతంగా ఉంటాయి ఈ చిత్రంలోని పాటలు.
అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. నిర్మాణ సంస్థకు కాసుల వర్షం కురిపించింది. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తమ బ్లాక్ బస్టర్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ గా చిత్రం నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇటీవల సీతారామం సక్సెస్ మీట్ లో పాల్గొన్న అశ్వినీ దత్ రామ్ చరణ్ తో తప్ప మరెవరితోనైనా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రూపొందించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒక పాత్రలో చేర్చాలనుకుంటున్నాను అని వెల్లడించారు.
అశ్వినీ దత్ ఇదే విషయాన్ని చిరంజీవితో మాట్లాడారని, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నారట. ఈ విషయంపై చర్చలు జరపగా కథ మెగాస్టార్ కి నచ్చలేదట. చరణ్ హీరోగా జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ కోసం తాజా కథ తీసుకురావడానికి మెగాస్టార్ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల బట్టి రాఘవేంద్రరావు కచ్చితంగా ఈ చిత్రాన్ని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమమైన కథను బయటకు తీసుకురావడంతోపాటు, సమర్థవంతమైన ఫిలిం మేకర్స్ కూడా అవసరం. అశ్వినీదత్ కి సరైన దర్శకుడు దొరికితే మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై త్వరలో ఏమైనా వివరాలను వెల్లడిస్తారేమో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…