Charmy Kaur : నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఛార్మి కౌర్. 13 సంవత్సరాల వయసులోనే తెలుగు తెర ఇండస్ట్రీలో అడుగు పెట్టి లక్ష్మీ, గౌరి, మంత్ర, మంగళ, రాఖీ, జ్యోతిలక్ష్మి వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం తెరపై కనిపించడం లేదు. చిత్రాల్లో నటించకపోయినా చిత్రసీమ మీద అభిమానంతో నిర్మాతగా మారింది.
పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. చిత్రాలలో నటించకపోయినా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. 2002లో ఛార్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఛార్మి తెలుగు తెరకు పరిచయమై దాదాపు రెండు దశాబ్దాలు కాబోతోంది. కానీ ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో యువతలో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.
చిత్రసీమలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఛార్మి ఇప్పటికీ ఎన్ని ఆస్తులు సమకూర్చుకుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. 2019 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఛార్మి రెండు మిలియన్ డాలర్ల అంటే దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని కూడబెట్టినట్లు వెల్లడయ్యింది. ఈ నాలుగు సంవత్సరాలలో ఆమె ఆస్తులు విలువ మరింత పెరిగినా ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాకుండా ఛార్మికి హైదరాబాద్లో ఎంతో ఖరీదైన అపార్ట్మెంట్ తో పాటు ఎన్నో విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి.
ఛార్మికి ఉన్న కార్స్ లిస్ట్ కూడా పెద్దదే. రూ.2 కోట్ల విలువ చేసే ఖరీదైన బీఎండబ్ల్యూ 730 ఎల్డీ తోపాటు మరికొన్ని కార్లు కూడా ఆమె దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా కోట్ల విలువ చేసే మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక హీరోయిన్ ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టడం అనేది అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ప్రస్తుతం ఈ నెల 25న విడుదల కాబోతున్న లైగర్ చిత్రం నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహిస్తోంది ఛార్మి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…