గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Charmy Kaur : చార్మి ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. షాక‌వుతారు..!

Charmy Kaur : నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఛార్మి కౌర్. 13 సంవత్సరాల వయసులోనే తెలుగు తెర ఇండస్ట్రీలో అడుగు పెట్టి లక్ష్మీ, గౌరి, మంత్ర, మంగళ, రాఖీ, జ్యోతిలక్ష్మి వంటి ఎన్నో…

Charmy Kaur : చార్మి ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. షాక‌వుతారు..!

Charmy Kaur : నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఛార్మి కౌర్. 13 సంవత్సరాల వయసులోనే తెలుగు తెర ఇండస్ట్రీలో అడుగు పెట్టి లక్ష్మీ, గౌరి, మంత్ర, మంగళ, రాఖీ, జ్యోతిలక్ష్మి వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం తెరపై కనిపించడం లేదు. చిత్రాల్లో నటించకపోయినా చిత్రసీమ మీద అభిమానంతో నిర్మాతగా మారింది.

పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. చిత్రాలలో నటించకపోయినా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. 2002లో ఛార్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఛార్మి తెలుగు తెరకు పరిచయమై దాదాపు రెండు దశాబ్దాలు కాబోతోంది. కానీ ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో యువతలో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.

do you know about Charmy Kaur assets
Charmy Kaur

చిత్రసీమలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఛార్మి ఇప్పటికీ ఎన్ని ఆస్తులు సమకూర్చుకుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. 2019 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఛార్మి రెండు మిలియన్ డాలర్ల అంటే దాదాపు 15 కోట్ల రూపాయల‌కు పైగా ఆస్తిని కూడబెట్టినట్లు వెల్లడయ్యింది. ఈ నాలుగు సంవత్సరాలలో ఆమె ఆస్తులు విలువ మరింత పెరిగినా ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాకుండా ఛార్మికి హైదరాబాద్‌లో ఎంతో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ తో పాటు ఎన్నో విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి.

ఛార్మికి ఉన్న కార్స్ లిస్ట్ కూడా పెద్దదే. రూ.2 కోట్ల విలువ చేసే ఖరీదైన బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ తోపాటు మరికొన్ని కార్లు కూడా ఆమె దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా కోట్ల విలువ చేసే మూడు అపార్ట్‌మెంట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక హీరోయిన్ ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టడం అనేది అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ప్రస్తుతం ఈ నెల 25న విడుదల కాబోతున్న లైగర్ చిత్రం నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహిస్తోంది ఛార్మి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి