IPL 2022 Final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ అట్టహాసంగా ముగిసింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు 1 లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఓ రికార్డు క్రియేట్ అయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియం ప్రపంచంలోని క్రికెట్ స్టేడియాలలో అతి పెద్ద స్టేడియం కావడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్కు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్పై ఇప్పుడు ప్రేక్షకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ట్విట్టర్లో పోస్ట్లను ట్రెండ్ చేస్తున్నారు. అందుకు వారు పలు కారణాలను కూడా చూపిస్తున్నారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమిత్ షా విక్టరీ సింబల్ చూపించారు. అలాగే రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ టీమ్ గతంలో ఆడిన మ్యాచ్ లలో చేజింగ్ ద్వారానే చాలా మ్యాచ్లను గెలిచింది. దీంతో ఈసారి ఫైనల్లోనూ గుజరాత్కు టార్గెట్ చేజింగే వచ్చింది. అయితే సంజు శాంసన్ కావాలనే ఇలా చేశాడని.. ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే తరువాత గుజరాత్ కు చేజింగ్ వస్తుంది కదా.. కనుక వారు సులభంగా గెలవొచ్చనే ఉద్దేశంతోనే సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడని.. లేదంటే రాజస్థాన్ గెలిచి ఉండేదని.. కావాలనే ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచేలా అన్ని విధాలుగా ఫిక్స్ చేశారని.. ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ జరిగింది నరేంద్ర మోదీ స్టేడియంలో.. రెండు జట్లలో ఒకటి గుజరాత్ జట్టు.. కనుక గుజరాత్కు విజయాన్ని కట్టబెట్టాలని చూశారని.. చివరకు అదే జరిగిందని.. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని క్రికెట్ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపిస్తూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. అయితే దీనిపై అటు బీసీసీఐ గానీ.. ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ స్పందించలేదు. వారు ఏమంటారో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…