IPL 2022 Final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ అట్టహాసంగా ముగిసింది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు 1 లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఓ రికార్డు క్రియేట్ అయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియం ప్రపంచంలోని క్రికెట్ స్టేడియాలలో అతి పెద్ద స్టేడియం కావడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్కు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్పై ఇప్పుడు ప్రేక్షకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ట్విట్టర్లో పోస్ట్లను ట్రెండ్ చేస్తున్నారు. అందుకు వారు పలు కారణాలను కూడా చూపిస్తున్నారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో అమిత్ షా విక్టరీ సింబల్ చూపించారు. అలాగే రాజస్థాన్ ప్లేయర్ సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ టీమ్ గతంలో ఆడిన మ్యాచ్ లలో చేజింగ్ ద్వారానే చాలా మ్యాచ్లను గెలిచింది. దీంతో ఈసారి ఫైనల్లోనూ గుజరాత్కు టార్గెట్ చేజింగే వచ్చింది. అయితే సంజు శాంసన్ కావాలనే ఇలా చేశాడని.. ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే తరువాత గుజరాత్ కు చేజింగ్ వస్తుంది కదా.. కనుక వారు సులభంగా గెలవొచ్చనే ఉద్దేశంతోనే సంజు శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడని.. లేదంటే రాజస్థాన్ గెలిచి ఉండేదని.. కావాలనే ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచేలా అన్ని విధాలుగా ఫిక్స్ చేశారని.. ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ జరిగింది నరేంద్ర మోదీ స్టేడియంలో.. రెండు జట్లలో ఒకటి గుజరాత్ జట్టు.. కనుక గుజరాత్కు విజయాన్ని కట్టబెట్టాలని చూశారని.. చివరకు అదే జరిగిందని.. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని క్రికెట్ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్లో ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపిస్తూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. అయితే దీనిపై అటు బీసీసీఐ గానీ.. ఇటు ఐపీఎల్ యాజమాన్యం కానీ స్పందించలేదు. వారు ఏమంటారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…