IPL 2022 Final : ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్‌ ఫిక్స్ అయిందా ? సంచలనం కలిగిస్తున్న ఆరోపణలు..!

May 30, 2022 4:29 PM

IPL 2022 Final : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 ఎడిషన్‌ అట్టహాసంగా ముగిసింది. రాజస్థాన్‌ రాయల్స్, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు 1 లక్షకు పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఓ రికార్డు క్రియేట్‌ అయింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ స్టేడియం ప్రపంచంలోని క్రికెట్‌ స్టేడియాలలో అతి పెద్ద స్టేడియం కావడం విశేషం. ఇక ఫైనల్‌ మ్యాచ్‌కు కేంద్ర మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌పై ఇప్పుడు ప్రేక్షకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫిక్స్‌ అయిందంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. అందుకు వారు పలు కారణాలను కూడా చూపిస్తున్నారు.

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అమిత్ షా విక్టరీ సింబల్‌ చూపించారు. అలాగే రాజస్థాన్‌ ప్లేయర్‌ సంజు శాంసన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ గతంలో ఆడిన మ్యాచ్ లలో చేజింగ్‌ ద్వారానే చాలా మ్యాచ్‌లను గెలిచింది. దీంతో ఈసారి ఫైనల్‌లోనూ గుజరాత్‌కు టార్గెట్‌ చేజింగే వచ్చింది. అయితే సంజు శాంసన్‌ కావాలనే ఇలా చేశాడని.. ముందుగా బ్యాటింగ్‌ తీసుకుంటే తరువాత గుజరాత్‌ కు చేజింగ్‌ వస్తుంది కదా.. కనుక వారు సులభంగా గెలవొచ్చనే ఉద్దేశంతోనే సంజు శాంసన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడని.. లేదంటే రాజస్థాన్ గెలిచి ఉండేదని.. కావాలనే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిచేలా అన్ని విధాలుగా ఫిక్స్‌ చేశారని.. ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు.

IPL 2022 Final is fixed say cricket fans
IPL 2022 Final

ఇక ఈ మ్యాచ్‌ జరిగింది నరేంద్ర మోదీ స్టేడియంలో.. రెండు జట్లలో ఒకటి గుజరాత్‌ జట్టు.. కనుక గుజరాత్‌కు విజయాన్ని కట్టబెట్టాలని చూశారని.. చివరకు అదే జరిగిందని.. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్‌ అయిందని క్రికెట్‌ ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ మ్యాచ్ ఫిక్స్‌ అయిందని ఆరోపిస్తూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనిపై అటు బీసీసీఐ గానీ.. ఇటు ఐపీఎల్‌ యాజమాన్యం కానీ స్పందించలేదు. వారు ఏమంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment