ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొద్ది రోజులలోనే భారత్ కి పెద్ద సహాయం చేశారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఎంతో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్-95 మాస్కులు, ర్యాపిడ్ టెస్టు కిట్లు పంపిణీ చేయటానికి యూఎస్ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్మెంట్(యూఎస్ఏఐడీ) సిద్ధం చేసింది.
అమెరికా సహాయంలో భాగంగా పది లక్షల రాపిడ్ టెస్ట్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్లు పంపనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. కేవలం 15 నిమిషాలలో ఎంతో స్పష్టమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ కిట్ల ప్రత్యేకత అదే . గత ఏడు సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఈ కోవిడ్ కష్టకాలంలో ఆ బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు.
కరోనా మొదటి దశలో భారత్ నుంచి అమెరికా ఎంతో సహాయం పొందిందని,ఇప్పుడు ఇండియాకి కూడా సహాయం అవసరం కనుక తమ దేశం నుంచి ఇప్పటికే 23 మిలియన్ డాలర్ల సాయం చేసిందని, మరో 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య పరికరాలను అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
భారత్కి 1100 ఆక్సిజన్ సిలిండర్లు, 1700 మెడికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఒక్కోటి 20 మందికి ఉపయోగపడే ఆక్సిజన్ యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు.
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…
కేజీఎఫ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…
స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…